ములుగు : కరోనాను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ సడలింపును ప్రజలు దుర్వినియోగం చేయవద్దని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. మంగళవారం జిల్లాలో డిస్టిక్ ఇమ్యూనైజేషన్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ శ్యాంసుందర్ తన బ్యాచ్ కు చెందిన గాంధీ మెడికల్ కళాశాల పూర్వ విద్యార్థుల సహకారంతో రూ .20 లక్షల విలువైన వైద్య పరికరాలను సమకూర్చారు.
వాటిని మంత్రి సత్యవతిరాథోడ్ , ఎమ్మెల్యే సీతక్క , జెడ్పీ చైర్మెన్ కుసుమ జగదీశ్వర్, జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య చేతుల మీదుగా దావాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ జగదీశ్వర్కు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గాంధీ మెడికల్ కళాశాల పూర్వ విద్యార్థులు కరోనా చికిత్సకు అవసరమయ్యే విలువైన పరికాలను అమెరికా నుంచి తెప్పించి అందించడం ఎంతో అభినందనీయమన్నారు.
వీటిని ఉపయోగించి దావాఖానకు వచ్చే కరోనా రోగులకు మెరుగైన చికిత్సను అందించాలని దావాఖాన సూపరిండెంట్ కు ఆమె సూచించారు. ప్రజలు కొవిడ్ నిబంధనలను పాటించాలని మంత్రి తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ఆపద వేళ ఎమ్మెల్యే సుమన్ ఆపన్న హస్తం
భద్రాద్రి జిల్లాలో తీరిన ఆక్సిజన్ కష్టాలు : మంత్రి పువ్వాడ
భూపాలపల్లిలో 30 పడకల కొవిడ్ వార్డు ప్రారంభం
అనాథ పిల్లలకు అండగా ఉంటాం: మంత్రి ఐకే రెడ్డి
సీఎం కేసీఆర్ నిర్ణయంతో వైద్య రంగం బలోపేతం
కరోనా పోవాలని ముత్నుర్లో మహిళల పూజలు