హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని మత్స్యకారుల సామాజిక భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నట్టు మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రంలో అర్హులైన 4,21,767 మంది మత్స్యకారులకు గ్రూప్ ప్రమాద బీమా పథకం(జీఏఐఎస్) అమలుకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్టు చెప్పారు. 18 నుంచి 70 ఏండ్ల మధ్య వయస్సుగల వారికి ఇది వర్తిస్తుందని వెల్లడించారు. ఒకో లబ్ధిదారునికి రూ.79.96 బీమా ప్రీమియం ఉండగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో భరించనున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.21,34,79,673 చెల్లిస్తుందని చెప్పారు. ఈ పథకం ద్వారా.. ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే రూ.5లక్షలు, శాశ్వత వైకల్యానికి రూ.5లక్షలు, పాక్షిక వైకల్యానికి రూ.2.50 లక్షలు, చికిత్సకు రూ.25,000 వరకు అందించనున్నట్టు మంత్రి శ్రీహరి చెప్పారు.