చేర్యాల/సిద్దిపేట : తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో మల్లన్న ఆలయ పరిసరాలు కిక్కిరిసాయి. ఈ సందర్భంగా భక్తులు కోనేటిలో పవిత్రస్నానం చేసి మల్లన్న స్వామిని దర్శించుకొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు అప్పజేప్పారు. ఆలయ ప్రాంగణంలోని గంగరేగి చెట్టు వద్ద పట్నాలు వేసి బోనాలు సమర్పించారు. కోరిన కోర్కెలు తీర్చాలని స్వామి వారిని వేడుకున్నారు.
ఇవి కూడా చదవండి..
ప్రారంభమైన అంతర్రాష్ట్ర రాకపోకలు
ఉజ్జయిని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు
పిజ్జాలంటే ఇష్టమన్న మీరాబాయి.. జీవితకాలం ఫ్రీగా ఇస్తామన్న డొమినోస్
చేపల వేటకి వెళ్లి వ్యక్తి గల్లంతు