MLC Kavitha | జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ( bail plea)పై విచారణను ఢిల్లీ హైకోర్టు వాయిదా వేసింది. బెయిల్ పిటిషన్పై వాదనలకు ఈడీ సమయం కోరడంతో విచారణను మే 24కి వాయిదా వేసింది. బెయిల్ అంశంపై ఆరోజు సమగ్ర విచారణ జరపాలని కోర్టు నిర్ణయించింది. ఈ మేరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate)కి ఢిల్లీ కోర్టు నోటీసులు ఇచ్చింది.
ఢిల్లీ మద్యం విధానంలో ఈడీ, సీబీఐలు తనపై నమోదు చేసిన అభియోగాలు కుట్రపూరితం, తప్పుడు కేసులు అని ఆరోపిస్తూ కవిత రౌస్ ఎవెన్యూ కోర్టులో బెయిల్ కోసం ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఈ రెండు కేసుల్లో బెయిల్ ఇచ్చేందుకు ట్రయల్ కోర్టు నిరాకరించింది. కింది కోర్టులో న్యాయం దక్కకపోవడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు సీబీఐ కేసులో కవిత వేసిన బెయిల్ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.
Delhi High Court issues notice to Enforcement Directorate (ED) on a bail plea moved by BRS leader K Kavitha in the money laundering case pertaining to the scrapped Excise policy of Delhi. Court fixes May 24 for detailed hearing in the matter.
K Kavitha has also moved a bail plea…
— ANI (@ANI) May 10, 2024
Also Read..
Brazil | వరదలకు బ్రెజిల్ అతలాకుతలం.. 107 మంది మృతి.. సాయం చేసేందుకు ముందుకొచ్చిన ఎలాన్ మస్క్
Akshaya Tritiya | నేడు అక్షయ తృతీయ.. దేశ ప్రజలకు మోదీ ప్రత్యేక శుభాకాంక్షలు
MLA Jagadish Reddy | కాంగ్రెస్ను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు : ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి