Akshaya Tritiya | నేడు అక్షయ తృతీయ (Akshaya Tritiya) సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi ) శుభాకాంక్షలు తెలిపారు. ఈ శుభ సందర్భం అందరి జీవితాల్లో కొత్త శక్తిని, ఉత్సాహాన్ని తీసుకురావాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ట్వీట్ పెట్టారు. ‘అక్షయ తృతీయ సందర్భంగా దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. దాతృత్వానికి స్ఫూర్తినిచ్చే ఈ శుభ సందర్భం మీ అందరి జీవితాల్లో కొత్త శక్తిని, ఉత్సాహాన్ని తీసుకురావాలని ఆశిస్తున్నాను’ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం మోదీ ట్వీట్ వైరల్ అవుతోంది.
देश के समस्त परिवारजनों को अक्षय तृतीया की हार्दिक शुभकामनाएं। परोपकार के लिए प्रेरित करने वाला यह पावन अवसर आप सभी के जीवन में नई ऊर्जा और नया उत्साह लेकर आए, यही कामना है।
— Narendra Modi (@narendramodi) May 10, 2024
అక్షయ తృతీయ రోజు బంగారం, వస్త్రాలు కొనుగోలు చేస్తే ఎప్పటికీ కొంటూనే ఉంటామని నమ్మకం. అందుకే ప్రజలు ఈ ప్రత్యేకమైన రోజున ఏదో ఒకటి కొనేందుకు ఆసక్తి చూపుతుంటారు. ముఖ్యంగా అక్షయ తృతీయ నాడు ప్రజలు ఎక్కువగా బంగారాన్నే కొనుగోలు చేస్తుంటారు. ఇవాళ చాలా మంది ఒక గ్రామైన బంగారం కొనుగోలు చేయాలని భావిస్తారు. అలా చేస్తే సిరిసంపదలు కలుగుతాయన్న నమ్మకం. అంతేకాదు ఈరోజు ఏ కార్యాలు తలపెట్టిన ఫలిస్తాయని విశ్వాసం. ఒకప్పుడు ఉత్తరాదిన నిర్వహించే ఈ పర్వదినం ఇప్పుడు దేశంలోని అన్ని ప్రాంతాల వారూ వేడుకగా జరుపుకొంటున్నారు.
Also Read..
viral video | మద్యం మత్తులో ముగ్గురు యువతులు హల్చల్.. ఇన్స్పెక్టర్ కాలర్ పట్టుకుని.. VIDEO
Kantilal Bhuria | ఇద్దరు భార్యలుంటే రూ.2 లక్షలు.. కాంగ్రెస్ అభ్యర్థి వివాదాస్పద వ్యాఖ్యలు