తాండూరు రూరల్, మే 21 : ప్రతి ఒక్కరూ లాక్డౌన్ నిబంధనలు పాటించాలని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి అన్నారు. శుక్రవారం జూనియర్ కళాశాల మైదానంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కూరగాయలు, పండ్ల మార్కెట్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూరగాయలు, పండ్ల కొనుగోలుకు వచ్చే వారు కచ్చితంగా మాస్క్ ధరించాలని సూచించారు. ఉదయం 6 గంటల నుంచి 10 లోపు మాత్రమే ప్రజలు నిత్యావసరాలను కొనుగోలు చేయాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ దీప, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకట్రెడ్డి, రాజు, పలువురు నాయకులు ఉన్నారు.
కొవిడ్ బాధితులకు భరోసా కల్పించాలి
కొవిడ్ బాధితులకు భరోసా కల్పించాలని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరులోని మతాశిశు దవాఖానలో కొనసాగుతున్న కొవిడ్ సెంటర్లోని ఐసొలేషన్ కేంద్రానికి గ్రీన్కో, ఏఎంఆర్ కంపెనీ ఆధ్వర్యంలో 9 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా బారిన పడిన వారికి జీవితంపై భరోసా కల్పించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందన్నారు. కరోనా బాధితులకు ఆక్సిజన్ కొరతరాకుండా చూస్తామన్నారు. ఎమ్మెల్యే వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణగౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, వైస్ చైర్మన్ దీపనర్సింహులు, జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ మల్లికార్జున్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంట్రెడ్డి, రాజు, శ్రీనివాస్చారి, రఘు, ఉమాశంకర్, రాజన్గౌడ్ ఉన్నారు.