వికారాబాద్ : ధారూరు మండల కేంద్రంలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పనులను ప్రజా ప్రతి నిధులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంలో స్పీడ్ పెంచాలన్నారు. నిర్మాణంలో నాణ్యత ఎక్కడ కూడా లోపించకుండా కాంట్రాక్టర్లు జాగ్రత వహించాలన్నారు.
నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించే విధంగా ఆధికారులు తనిఖీ చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ జైదుపల్లి విజయలక్ష్మి, జడ్పీటీసి కోస్నం సుజాత, వైస్ ఎంపీపీ విజయ్కుమార్, తహసీల్దార్ భీమయ్య గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
యునెస్కో గుర్తింపుతో రామప్ప మరింత అభివృద్ధి
Tokyo Olympics: బ్రెస్ట్స్ట్రోక్ చాంపియన్గా 17 ఏళ్ల లిడియా జాకొబీ
బీజేపీ నుంచి టీఆర్ఎస్లోకి చేరికలు