కుమ్రం భీం ఆసిఫాబాద్ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా కౌటాల మ౦డల౦లోని గురుడుపేట గ్రామానికి చెందిన 30 మంది బీజేపీ కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు. టీఆర్ఎస్లోని ప్రతి కార్యకర్తకు సరైన గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
యునెస్కో గుర్తింపుతో రామప్ప మరింత అభివృద్ధి
Tokyo Olympics: బ్రెస్ట్స్ట్రోక్ చాంపియన్గా 17 ఏళ్ల లిడియా జాకొబీ