ఒకే రోజు లక్ష బస్తాల రాక
ఖమ్మం ఏఎంసీకి భారీగా వచ్చిన మిర్చి పంట
రెండుయార్డులను సిద్ధం చేసిన యంత్రాంగం
ప్రశాంతంగా కొనసాగిన క్రయవిక్రయాలు
ఖమ్మం వ్యవసాయం, ఏప్రిల్ 19: ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు రైతులు రికార్డు స్థాయిలో లక్ష మిర్చి బస్తాలను తీసుకువచ్చారు. సోమవారం తెల్లవారుజామున వర కు దాదాపుగా 70 వేల బస్తాలను కార్మికులు దిగుమతిచేశారు. జెండాపాట సమాయానికి గేట్ ప్రవేశమార్గంలోకి మరో 30 వేల బస్తాలు వచ్చాయి. అప్రమత్తమైన ఏఎంసీ చైర్మన్ మద్దినేని వెంకటరమణ, వైస్ చైర్మన్ పిన్ని కోటేశ్వరరావు, సెక్రటరీ మల్లేశం ముందస్తు చర్యలు చేపట్టారు. తొలుత జెండాపాటకు ఏర్పాట్లు చేశారు. ఉదయం జెండాపాటలో క్వింటా మిర్చి గరిష్ఠ ధరను రూ.14,700గా ధర నిర్ణయించి వ్యాపారులు కొనుగోలు చేశారు. కొద్దిసేపటికే కొందరు రైతులు తమ పంటకు గిట్టుబాటు ధర రావడం లేదని భావించి విషయాన్ని చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తక్షణం స్పందించిన చైర్మన్ సదరు రైతుల పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, ఇష్టారీతిన ధరలు పెట్టడం సరికాదని వ్యాపారులకు సూచించారు. సోమవారం నుంచి రెండు ప్రధాన యార్డులనూ మిర్చి క్రయవిక్రయాల కోసం వినియోగిస్తామన్నారు. సాయంత్రం వరకు మిర్చియార్డులో తోలకాల ప్రక్రియ కొనసాగింది.
ఇవి కూడా చదవండి
సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలి.. ప్రముఖుల ఆకాంక్ష
అన్నమయ్య సంకీర్తనలు- సామాజిక దృక్పథంపై వీధి అరుగు కార్యక్రమం