హైదరాబాద్ : నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ తిరుగులేని విజయం సాధించడం పట్ల గిరిజ సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం కట్టబెట్టిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. నిత్యం పర్యవేక్షిస్తూ పార్టీని విజయతీరాలకు చేర్చిన టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఈ గెలుపు కోసం కృషి చేసిన మంత్రులు, టీఆర్ఎస్ శ్రేణులందరికి అభినందనలు తెలిపారు. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కు శుభాకాంక్షలు తెలిపారు.
నాగార్జున సాగర్ ప్రజలు టీఆర్ఎస్ వెంట నిలిచారని, సీఎం కేసీఆర్ నాయకత్వానికి పట్టం కట్టారన్నారు. ఈ రాష్ట్రంలో ఎన్నిక ఏదైనా గెలుపు టీఆర్ఎస్ దేనని మరోసారి రుజువు చేశారన్నారు.
ఇవి కూడా చదవండి..
భార్యను వేట కొడవలితో నరికి చంపిన భర్త
బైక్ను ఢీకొట్టిన లారీ..ఆర్ఎస్ఐ మృతి
రంజాన్ కిట్లను పంపిణీ చేసిన మంత్రి అల్లోల
సీనియర్ ఫొటోగ్రాఫర్ సలీం మృతి పట్ల మంత్రి వేముల సంతాపం