భద్రాద్రి కొత్తగూడెం : లారీ అదుపు తప్పి బైక్ను ఢీ కొట్టిన సంఘటనలో ఆర్ఎస్ఐ మృత్యువాత పడ్డాడు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని బూర్గంపహాడ్ మండలం మొరంపల్లి బంజర్ ప్రాథమిక కేంద్రం వద్ద చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. పాల్వంచ వైపు నుంచి భద్రాచలం వైపు వెళ్తున్న ఓ లారీ.. ఎదురుగా వస్తున్న బైక్ను ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో ఎటపాకలో విధులు నిర్వహిస్తున్న ఆర్ఎస్ఐ షేక్ జిలాని పాషా (33) అక్కడికక్కడే మృతి చెందాడు. కానిస్టేబుల్ సురేష్కు తీవ్ర గాయాలు కావడంతో భద్రాచలం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఈ సంఘటనలో లారీ మరో కారును, మరో బైక్ను ఢీకొట్టింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
భార్యను వేట కొడవలితో నరికి చంపిన భర్త
నాగార్జునసాగర్ ఎన్నికల ఫలితాల లైఫ్ అప్డేట్స్