Cm KCR | తెలంగాణ ప్రభుత్వం (Telangana Governament) ఏర్పడిన వెనువెంటనే చేపట్టిన బృహత్తరమైన పథకం మిషన్ కాకతీయ (Mission Kakatiya) అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 47 వేలకు పైగా చెరువులను పునరుద్ధరించినట్లు చెప్పారు.
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా (Telangana Decade celebrations) హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో సీఎం కేసీఆర్ (Cm KCR) జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘మిషన్ కాకతీయ పథకం ద్వారా రాష్ట్రంలో 47 వేలకు పైగా చెరువులను పునరుద్ధరించాం. చెరువు కట్టలను పటిష్టపరిచి, కాలువలకు, తూములకు మరమ్మతులు చేసి, పూడిక తొలగించాం. ఫలితంగా నేడు రాష్ట్రంలోని చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా పెరిగిపోయింది. 5,350 కోట్ల రూపాయలు వెచ్చించి చెరువులను పునరుద్ధరించడంతోపాటు, విరివిగా చెక్ డ్యాముల నిర్మాణం చేపట్టి వాగులను పునరుజ్జీవింప చేయటంతో లక్షలాది ఎకరాల ఆయకట్టు స్థిరీకరించబడింది. ఫలితంగా, నేడు దేశవ్యాప్తంగా 94 లక్షల ఎకరాల వరి సాగు అయితే.. అందులో 56 వేల ఎకరాలు యాసంగిలో తెలంగాణలోనే సాగు అయ్యింది’ అని సీఎం కేసీఆర్ వివరించారు.
నేడు దేశంలో చాలాచోట్ల భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని, కానీ, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఉబికిఉబికి పైకి వస్తున్నాయని చెప్పారు. చెరువుల కింద ఆయకట్టుకు సాగునీరు సమృద్ధిగా లభిస్తుండటంతో ఆకుపచ్చ తివాచీ పరచినట్టు కనిపిస్తూ పంట పొలాలు కనువిందు చేస్తున్నాయని సీఎం అన్నారు.
Also Read..
CM KCR | విద్యుత్తు సరఫరాలో తెలంగాణ కీర్తి.. పవర్ హాలిడేలే లేవు : సీఎం కేసీఆర్
CM KCR | తెలంగాణలో పండుగలా సాగుబడి.. భూమికి బరువయ్యేంత దిగుబడి: ముఖ్యమంత్రి కేసీఆర్