హైదరాబాద్ : దేశ ప్రజలంతా కోరితే.. అందరూ కోరితే తప్పకుండా దేశవ్యాప్తంగా పార్టీ పెడతా.. అని సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్లో చెప్పారు. కేసీఆర్కు దమ్ములేదా.. అధికారం లేదా.. తప్పకుండా అవసరం వస్తే పార్టీ పెడదాం. టీఆర్ఎస్ పార్టీ పుట్టిన నాడు ఏమన్నరు.. ఇప్పుడు ఏమైంది.. ఇది ప్రజాస్వామ్యం.. ప్రజలు అనుకున్న నాడు తలకిందులు అయితది.
కేసీఆర్ నీటిబొట్టు అంత కాదు అన్నరు నిన్న.. మరి నీటిబొట్టు లాంటి కేసీఆర్ ను చూసి ఎందుకు భయపడుతున్నారు. ఇప్పుడు కూడా ఏం జరుగుతదో ఎవరికి తెలుసు. నేను రైల్వే స్టేషన్లో చాయ్ అమ్ముకున్నా అని మోదీనే చెప్పారు కదా. ఆయన ప్రధాన మంత్రి కాలేదా. సినిమా నటులు ముఖ్యమంత్రులు కాలేదా. ఎంజీఆర్, ఎన్టీఆర్ ముఖ్యమంత్రులు అయ్యారు. ఏం జరుగుతుందో నాకు తెలియదు కానీ.. ఏదో ఒకటి మాత్రం జరుగుతుంది.. అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
Read more :
ప్రజలంతా కోరితే దేశవ్యాప్తంగా పార్టీ పెట్టడానికి కూడా వెనుకాడను : సీఎం కేసీఆర్
CM KCR | కేంద్ర ప్రభుత్వంది రాజ్యాంగ ఉల్లంఘన : సీఎం కేసీఆర్
ఏ సబ్సిడీ ఇవ్వొద్దు అంటడు.. నేను ఫ్రీ పవర్ ఇచ్చుకుంటే నీకేం నొప్పి : కేసీఆర్
దమ్ముంటే దేశాన్ని చైనాలా అభివృద్ధి చేయండి: సీఎం కేసీఆర్