హైదరాబాద్: సీఎం కేసీఆర్ కేంద్రంలోని బీజేపీ సర్కారు పనితీరును మరోసారి ఎండగట్టారు. మోదీ ప్రభుత్వానికి దమ్ముంటే దేశాన్ని చైనాలా అభివృద్ధి చేయాలని సవాల్ చేశారు. దేశ అభివృద్ధి గురించి సీఎం కేసీఆర్ ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే..
సాధారణంగా 12 శాతం గ్రోత్ ఉంటే 6 ఏండ్లలో దేశ ఎకానమీ డబుల్ అవుతుంది. 11 శాతం ఉంటే 7 ఏండ్లలో డబుల్ అవుతుంది. అది నరేంద్ర మోదీ, నిర్మలా సీతారామన్ చెప్పాల్సిన అవసరం లేదు. ఏ వడ్డీ వ్యాపారిని అడిగినా చెబుతడు. ఇది కఠోరమైన వాస్తవం. 2025 వరకు 5 ట్రిలియన్ ఎకానమీకి తీసుకెళ్లడానికి నరేంద్ర మోదీ అవసరం లేదు. మీకు దమ్ముంటే.. మీరు దేశాన్ని అభివృద్ధి చేయాలని అనుకుంటే.. చైనాలా అభివృద్ధి చేయండి. సింగపూర్లా అభివృద్ధి చేయండి. అది చేయండి కానీ.. 5 ట్రిలియన్ ఎకానమీ కాదు. ఇది నేను చెప్పడమే కాదు.. నేను చెప్పిన విషయాన్నే చిదంబరంగారు కూడా రాజ్యసభలో చెప్పారు.
మావాళ్లు కూడా ఉన్నారు. అన్నీ గోల్ మాల్ మాటలు చెప్పి.. అబద్ధాలు చెప్పి ఎవరిని వంచించాలని అనుకుంటున్నరు. అందుకే వీళ్లను తరిమికొట్టకపోతే దేశమే నాశనం అయిపోతది.