KCR Pressmeet | బడ్జెట్పై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. ఏం అవగాహన చేసుకోక మాట్లాడినం.. ఏది అబద్ధమని ప్రశ్నించారు. బడ్జెట్లో తగ్గింపులు నిజం కాదా అని అడిగారు. అలాగే సబ్సిడీలు తగ్గించడం, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణపై కూడా ఆయన సీరియస్ అయ్యారు.
ప్రెస్మీట్లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఆయన ( మోదీ ) నియ్యతి, ఆలోచన సరళి బయటపడింది ఇక లాభం లేదు. ఇక ఈ గొప్పతనానికి మన దగ్గర ఒక ఆయన కిషన్ రెడ్డి అనే మంత్రి ఉన్నాడు.. ఆయన నాకు మిత్రుడే. నాకు గౌరవమే. వ్యక్తిగతంగా ఆయనతో ఏ పంచాయతీ లేదు. కానీ ఆయన కూడా అలా మాట్లాడుడు ధర్మం కాదు. బడ్జెట్ను నేను అర్థం చేసుకోలేదంట. ఈయనకు ఏం అర్థమయ్యిందో.. ఈ మహాత్ముడికి.. సరిగ్గా అవగాహన చేసుకోక మాట్లాడినమంట. ఏం అవగాహన చేసుకోక మాట్లాడినం.. ఏది అబద్ధమండి.. 34,900 కోట్ల ఎరువుల సబ్సిడీ తగ్గించింది అబద్ధమా కిషన్ రెడ్డి గారు .. ఆహార సబ్సిడీని 65వేల కోట్లు తగ్గించింది అబద్ధమా? గ్రామీణ ఉపాధి పథకానికి 25 కోట్లు తగ్గించింది అబద్ధమా? మాకెందుకు అర్థం కాలేదు.. మాకు అర్థమయ్యి ఉన్నది ఉన్నట్టు చెప్పినం.. మీ రంగు బయటపెట్టినం.. నీకు అర్థం కాలే.. ఎవరికి అర్థం కానట్టు కేసీఆర్కా? కిషన్ రెడ్డికా? వట్టిగనే గాలిపుడీలు మాట్లాడితే ఎట్ల. మీమెందుకు అర్థం చేసుకోలేదండి.. బడ్జెట్ను బ్రహ్మాండంగా అర్థం చేసుకున్నం. దీనిపై ఎవరు మాట్లాడరెంది? ఈ తగ్గింపులు కరెక్ట్ కాదా? 40 కోట్ల జనాభా ఉన్న దళితులకు పెట్టింది 12,800 కోట్లు నిజం కాదా? మీ ఘనత వహించిన ప్రభుత్వంలో జుట్టుకు 300 వస్తయి. ప్రగతే ప్రగతి ఇక. తుపాకీ రామని ప్రగతి. అంతే కదా? ఏమని అర్థం చేసుకోవలె. దానికి మా మీద నిందలు పెట్టుడా? మాకు అర్థం కాలేదని. ఇది పద్ధతి కాదు. చర్చ చేద్దామా? దానికి మేం రెడీ. ఇది దేశాన్ని నడిపే పద్ధతి కానే కాదు. అని మండిపడ్డారు.
కరోనా వల్ల నష్టం వచ్చింది. హెల్త్ ఇన్ఫ్రాస్టక్చర్ పెంచాలి అన్నం.. పెంచలె.. ఇది నిజం కాదా నాకెందుకు అ ర్థం కాలే బడ్జెట్. నీకు అర్థం కాలే. నువ్వు జనాల్ని గోల్మాల్ చేస్తున్నవ్..నేను చేస్తలేను.. అన్నిటిని అమ్మేస్తున్నరు అని చెప్పినం.. అమ్ముతున్నది నిజం కాదా? రైళ్లు అమ్ముతున్నరు.. విమానాలు అమ్మవడితిరి. బ్యాంకులు అమ్మవడితిరి.. ఎల్ఐసీ అమ్మవడితిరి? ఏది అమ్ముతలేరు మీరు? మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మవడితిరి.. కరెంట్ కూడా అమ్మేసేందుకు కూడా రెడీ కావడితిరి.. దానికే కదా మేం వ్యతిరేకిస్తున్నం. పేరుకు విద్యుత్ సంస్కరణలు.. దానిపేరు ప్రైవేటీకరణ. ప్రమాదం ఏందంటే దాంట్ల ప్రైవేటు డిస్కంలు వస్తయంట.. ఉన్న డిస్కంలు పోగొట్టి. ఇగ వాని దయ. వాడు ఏం ఛార్జి విధించిన కట్టాల్లె మీరు కూడా బలైతరు నేను చెబుతున్న. కంప్లీట్ ప్రైవేట్ చేతుల్లోకి పోతే ఏముంటది.. ఇక వాడి ఇష్టం. వాడి దయ. ఇంతకైతే ఇస్తా లేకపోతే లేదంటడు. విద్యుత్ సంస్కరణలు నథింగ్ బట్.. విద్యుత్ను ప్రైవేటీకరించి, కార్పొరేట్ పెద్దలు, కార్పొరేట్ గద్దలకు అప్పజెప్పే కుటిల నీతి. దానికి మేం వ్యతిరేకిస్తున్నం. అని సీఎం కేసీఆర్ అన్నారు.
మీరు ప్రవేశపెట్టిన విద్యుత్ సంస్కరణ.. రాష్ట్రాలకు ముఖ్యమంత్రులకు పంపిన బిల్లు .. విద్యుత్ కార్యదర్శులకు, జెన్కోకు, ట్రాన్స్కోకు వచ్చింది. అందులో ప్రస్ఫుటంగా చెప్పారు. మీ నియ్యతి ఏంది? కంప్లీట్ ప్రైవేటైజేషన్ చేయడం. అప్పుడేం జరుగుతది.. ఇబ్బడి ముబ్బడిగా ఛార్జీలు పెరుగుతయి. ప్రజలు ఛస్తరు. ఇది దేశానికి మంచిది కాదు. మీకు ఇంకా ఈజీగా అర్థం కావాలంటే.. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొరకంగా ఉంటది. నా రాష్ట్రంలో నీళ్లు కిందకు ఉంటయి. వ్యవసాయ భూమి పైకి ఉంటది.. నేను నీళ్లు లిఫ్ట్ చేసి తెచ్చుకోవల్లె. నేను ఫ్రీ పవర్ ఇచ్చుకుంట నేకేం బాధ. నీకేం కడుపునొప్పి. సమైక్య రాష్ట్రంలో నష్టపోయినా. పేదలు ఉన్నరు.నేను లాండ్రీలకు సబ్సిడీ మీద పవర్ ఇచ్చుకుంటున్న. సెలూన్స్కు సబ్సిడీ మీద ఇచ్చుకుంటున్న. ఎస్సీ, ఎస్టీలకు సబ్సిడీ ఇచ్చుకుంటున్న. 200 యూనిట్ల వరకు ఫ్రీగా ఇచ్చుకుంటున్న. అదంతా బంజేయాలని అంటడు. ప్రతి కనెక్షన్కు మీటర్కు పెట్టాల్లె. ఏ సబ్సిడీ ఇవ్వొద్దు.. ఆ ప్రపోజల్ బిల్లులో ఉంది.. ఇక లాండ్రీలకు బంజేయాల్లె. మంగలి షాపులకు బంజేయాలి. ఫౌల్ట్రీలకు బంజేయాల్లె. నీ విద్యుత్ సంస్కరణల్లో రాసినవ్ ఇదంతా. అనేక మందికి సబ్సిడీ ఇస్తున్నం. దాని మీద అసలు మాట్లాడుడె లేదు. మాకేదో అర్థం కానట్టు.. మీకు అర్థం కాలేదు.. ఇది కాలేదు అని అడ్డంపొడువు మాట్లాడుడు. పిచ్చి పిచ్చి మాట్లాడుడు. ఇది సరైన పద్ధతి కాదు. బడ్జెట్పై అవగాహన లేకుండా మాట్లాడినం అన్న కిషన్ రెడ్డి గారు. అవగాహన నీకు లేకపోతే నువ్వు చేసుకునే ప్రయత్నం చెయ్యి.. మాకు అవగాహన లేదనేటువంటి మాట.. దయచేసి మీరు మాట్లాడుడు సమంజసం కాదని చెబుతున్నా. పద్దతి కాదు.. ఇప్పుడు మర్యాదగా చెబుతున్నా.. మరోసారి హార్ష్గా చెప్పాల్సి వస్తది. జాగ్రత్త. కేంద్రం కెల్లి మా రాష్ట్రం నుంచి ఉన్న ఒక్క మంత్రివని మర్యాద పాటించి చెబుతున్న. మొత్తం దేశం నాశనమైంది మీ బీజేపీ పాలనలో. ఎక్కడ చూసిన అవినీతి కంపు. అన్ని స్థాయిల్లో ఘోరమైన అవినీతి. ఘోషిస్తున్నది జాతీయ, అంతర్జాతీయ మీడియా చెబుతున్నది.
దేశ సంపదలో 77 శాతం సంపద 10 శాతం మంది దగ్గరనే ఉన్నది లెక్కలన్ని చెబుతున్నయి. 90 శాతం దగ్గర 23 శాతమే ఉంది. అంటే ఏమైనట్లు మీ ఘనత వహించిన ప్రభుత్వంలో. ధనవంతులు ధనవంతులు అవుతున్నరు. పేదలు పేదలే అయితున్నరు. భయంకరంగా నిరుద్యోగిత పెరిగింది. మీరు చెప్పిన లెక్కల్లనే వస్తుంది అది. నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అని ఉంటది. నేను చెప్పే లెక్కలు ఎన్ఎస్వో లెక్కలె. నా లెక్కలు కావు. కేసీఆర్ కల్పితం కాదు.. కేంద్రం వెలువరించే స్టాటిక్స్నే నేను చెప్పింది. నిరుద్యోగిత పెరిగింది. తెలంగాణలో 0.3 పర్సెంట్ ఉంటే మీది 7 శాతం పైన ఉంది. నేషనల్ యావరేజ్. హంగర్ ఇండెక్స్లో 101 స్థానానికి పోయింది. 16 లక్షల పరిశ్రమలు మూతబడ్డయి. దేశంలో కరెంట్ వాడే పరిస్థితి లేదు. పారిశ్రామిక ఉత్పత్తి సెప్టెంబర్లో 4.4 శాతం ఉండే.. అక్టోబర్లో 4 ఉంటే.. నవంబర్లో 1.4 పర్సెంట్ దిగజారింది. డిసెంబర్లో 0.4 కు పోయింది. ఇది మోదీగారి గొప్ప ఆదర్శవంతమైన పరిపాలనకు నిదర్శనమా? ఈ స్టాటిస్టిక్స్ ఇచ్చింది కూడా ఎన్ఎస్వోనే. నేను కాదు. బ్యాంకులను లూటీ చేసే ఘోరమైన దొంగలు.. గజదొంగలు.. రైతులకు మీటర్లు పెట్టాల్లె. దానికి విద్యుత్ సంస్కరణలు అని పేరు పెట్టాల్లె. సబ్సిడీ బంజేయాల్లె. ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చేది బంజేయాల్లె. కానీ దొంగలకు సద్ది కట్టాల్లె.