గద్వాల/శ్రీశైలం, ఆగస్టు 14 : ఎగువ నుంచి జూరాల ప్రాజెక్టుకు వరద నిలిచి పోవడంతో జూరాల గేట్లు మూసివేశారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 10,000 క్యూసెక్కుల నీరు వస్తున్నది. జూరాల పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా ప్ర స్తుతం ప్రాజెక్టులో 317.90 మీటర్ల నీటి నిల్వ ఉన్నది. ఎత్తిపోతలు, కాల్వ కు నీటి విడుదల చేయడంతో అవుట్ ఫ్లో 5,545 క్యూసెక్కులుగా నమోదైంది. వరద తగ్గుముఖం పట్టడంతో విద్యుత్ ఉత్పత్తిని కూడా నిలిపి వేశా రు. శ్రీశైలం జలాశయానికి ఇన్ఫ్లో పూర్తిగా నిలిచిపోయింది. శుక్రవారం 19,545 క్యూసెక్కుల నీరు వచ్చినట్టు తెలిపారు. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 878.80 అడుగులు ఉన్నది.