సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అగ్నిపథ్కు వ్యతిరేకంగా జరిగిన ధర్నా హింసాత్మకం కావడంపై సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే పోలీసుల కాల్పుల్లో వరంగల్ జిల్లాకు చెందిన రాకేశ్ మరణించడం బాధాకరమని అన్నారు. అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
రాకేశ్ కుటుంబానికి సీఎం కేసీఆర్ 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అలాగే కుటుంబంలో అర్హులైన వారికి వారి అర్హత మేరకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ విధానాలకు బీసీ బిడ్డ రాకేశ్ బలయ్యాడని వాపోయారు. తెలంగాణ బిడ్డలను రాష్ట్ర ప్రభుత్వం కడుపులో పెట్టుకొని కాపాడుకుంటుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు
అగ్నిపథ్పై ఆగ్రహజ్వాలలు ఎందుకు..? దాని అసలు స్వరూపం ఏంటి..?
సికింద్రాబాద్ స్టేషన్లో యథావిధిగా రైళ్ల పునరుద్ధరణ.. బయల్దేరిన కాకినాడ ఎక్స్ప్రెస్
పోలీసుల కాల్పుల్లో గాయపడ్డ 13 మంది ఆర్మీ ఉద్యోగార్థులు.. గాంధీలో చికిత్స
అగ్నిపథ్కు వ్యతిరేకంగా… శనివారం బీహార్ బంద్