హైదరాబాద్ : అగ్నిపథ్కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఆర్మీ ఉద్యోగార్థులు చేపట్టిన ఆందోళన కాల్పులకు దారి తీసింది. పలు రైళ్లకు నిప్పు పెట్టిన ఆందోళనకారులు.. రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఒకరికి కాలు ఫ్యాక్చర్ కాగా, మరొకరికి ఛాతీలో బుల్లెట్ దిగింది. ఈ ఇద్దరికి వైద్యులు సర్జరీ నిర్వహిస్తున్నారు. మిగతా వారికి స్వల్ప గాయాలయ్యాయి. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని గాంధీ వైద్యులు స్పష్టం చేశారు.