గాలే: రిషబ్ పంత్ తన ఖాతాలో అరుదైన రికార్డును వేసుకున్నాడు. టెస్టుల్లో వంద సిక్సర్లు బాదిన భారత బ్యాటర్గా నిలిచాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో వికెట్కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. కేవలం 89 ఇన్నింగ్స్లోనే వంద సిక్సర్లు బాదాడు పంత్. డీప్ ఫైన్ లెగ్లో స్వీప్ షాట్ సిక్సర్తో ఈ మ్యాచ్లో పంత్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. రెండో ఇన్నింగ్స్లో 66 రన్స్ చేసి అతను ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్లో పంత్ రెండు సిక్సర్లు బాదాడు. టెస్టుల్లో ఫాస్టెస్ట్ 100 సిక్సర్లు కొట్టిన బ్యాటర్గా ఘనత సాధించాడు. 4918 బంతుల్లో పంత్ వంద సిక్సులు బాదాడు. గతంలో ఆడమ్ గిల్క్రిస్ట్ పేరిట ఆ రికార్డు ఉన్నది. 6,578 బంతుల్లో గిల్క్రిస్ట్ ఆ రికార్డు క్రియేట్ చేశాడు.
Maximum number 1⃣0⃣0⃣ in Test Cricket for Rishabh Pant! 💥
He becomes the first #TeamIndia batter to reach that special milestone in men’s cricket 🫡🫡
Updates ▶️ https://t.co/M9LVyCAp8y#SLvIND pic.twitter.com/24yVuJ7FzX
— BCCI (@BCCI) August 18, 2026
మరో వైపు భారత్ తన రెండో ఇన్నింగ్స్లో తాజా సమాచారం ప్రకారం 47 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 190 రన్స్ చేసింది. భారత్ ఆధిక్యం 350 రన్స్ దాటింది.