KCR | బీఆర్ఎస్ అధినేత (BRS chief) కేసీఆర్ (KCR)ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM Jagan) కలవనున్నారు. సీఎం జగన్ గురువారం హైదరాబాద్ (Hyderabad)కు రానున్నారు. ఈ క్రమంలో బంజారాహిల్స్ నందినగర్లోని నివాసంలో కేసీఆర్ను జగన్ కలిసి పరామర్శించనున్నట్లు సమాచారం.
కాగా, కేసీఆర్ ఇటీవలే తన ఫామ్హౌస్లో జారిపడటంతో తుంటి ఎముక విరిగిన విషయం తెలిసిందే. సోమాజీగూడ యశోద ఆసుపత్రిలో కేసీఆర్కు వైద్యులు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. ఆ తర్వాత కొన్ని రోజులకు డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం కేసీఆర్ గాయం నుంచి కోలుకుంటున్నారు. ఈ క్రమంలోనే సీఎం జగన్.. కేసీఆర్ను పరామర్శించనున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ అధినేత ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీయనున్నట్లు సంబంధిత వర్గాల నుంచి సమాచారం.
Also Read..
Chaddannam | అమెరికాలో చద్దన్నానికి యమా క్రేజ్.. ధర తెలిస్తే షాకే..!
Arvind Kejriwal | ఈడీ విచారణకు మరోసారి కేజ్రీవాల్ డుమ్మా
YS Sharmila ఏపీ సీఎం వైఎస్ జగన్ను కలవనున్న షర్మిల