హైదరాబాద్ : (TS Rains) బంగాళాఖాతంలో వారం క్రితం ఏర్పడిన అల్పపీడనం బుధవారం అరేబియా సముద్రం వైపునకు వెళ్లిపోయిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే, ఉపరితల ద్రోణి కొమరిన్ నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్, తమిళనాడు తీరం మీదుగా పశ్చిమ బంగాళాఖాతంలోని దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వరకు స్థిరంగా కొనసాగుతుందని పేర్కొన్నది. రాష్ట్రంలోకి ఈశాన్య దిశ నుంచి కింది స్థాయి గాలులు వీస్తున్నాయని, దీని ప్రభావంతో రాష్ట్రంలో ఈనెల 7 వ తేదీ వరకు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. కాగా, బుధవారం రాత్రి, గురువారం అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నది.
బుధవారం రాత్రి జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలు, 4వ తేదీ గురువారం నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్ జిల్లాల్లో ఒకటి రెండు ప్రదేశాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ తెలిపింది.
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 22 జిల్లాల్లో పలు చోట్ల వర్షం కురిసిందని టీఎస్డీపీఎస్ పేర్కొన్నది. అత్యధికంగా జనగాం జిల్లా దేవరుప్పల మడలం కోల్కొండలో 9.50, దేవరుప్పుల 6.48, పాలకుర్తి 5.60, జాఫర్గఢ్ 5.58 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు అత్యంత తక్కువగా కొమ్రంబీమ్ జిల్లా సిర్పూర్లో 16.9 సెల్సీయస్ డిగ్రీలు, అత్యధికంగా నారాయణపేట జిల్లా జాక్లైర్లో 35.7 డిగ్రీల సెల్సీయస్ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు టీఎస్డీపీఎస్ వెల్లడించింది.
బస్సు కోసం సీజేఐకి చిన్నారి లేఖ.. ఏర్పాట్లు చేసిన సజ్జనార్
దేశవ్యాప్తంగా 10 వేల ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు : ఐఓసీ
మూడో రోజు కొనసాగిన రైతుల మహా పాదయాత్ర
కార్తీకమాసం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు
ఈ పండక్కి ఎక్కువగా ఖర్చు చేసేందుకు 75 శాతం మంది సిద్ధం : సర్వేలో వెల్లడి–
కొత్త శాఖ ఏర్పాటు చేసిన ఏపీ సర్కార్.. ఉత్తర్వులు జారీ
బకాయిలు చెల్లించాలంటూ రైతుల ఆందోళన, ఉద్రిక్తం
బద్వేల్లో నైతిక విజయం మాదే : కన్నా లక్ష్మీనారాయణ
బద్వేల్ ఓటర్లు బీజేపీనే కాదు వాటిని కూడా ఓడించారు : ఎంపీ సురేష్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..