మేడ్చల్ మల్కాజిగిరి : నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదం చేస్తాయని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం కీసర పోలీసుస్టేషన్ పరిధిలోని కీసర, అంకిరెడ్డిపల్లి గ్రామాల్లో 136 సీసీ కెమెరాలను మంత్రి మల్లారెడ్డి, రాచకొండ సీపీ మహేశ్ భగవత్తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నాయకులు, దాతల సహకారంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. నేరాల నియంత్రణకు పోలీసులు సీసీ కెమెరాలను ఏర్పాటు విషయంలో చూపుతున్న చొరవ ప్రజలు సురక్షితంగా ఉండటానికే అన్నారు.
నేరాలను తక్షణమే పరిష్కారించడానికి సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలన్నారు.
ఇవి కూడా చదవండి..
రైతులు డిమాండ్ ఉన్న పంటలనే పండించాలి
బీచ్లో శ్రద్దాదాస్ షికార్లు..ఫొటోలు వైరల్
త్వరలో టీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం : మంత్రి ఎర్రబెల్లి
మాస్క్ ధరించాలని పోలీసుల ప్రచారం
గిరిజన మహిళలను పారిశ్రామిక వేత్తలుగా మారుస్తున్న సీఎం కేసీఆర్