MLC Kavitha | హైదరాబాద్ : కామారెడ్డి డిక్లరేషన్ అమలుతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలన్న డిమాండ్తో సావిత్రీ బాయి పూలే జయంతిని పురస్కరిం చుకొని ఈ నెల 3వ తేదీన ఇందిరా పార్కు వద్ద బీసీ మహాసభ పేరిట తెలంగాణ జాగృతి సంస్థ భారీ సభను తలపెట్టనుంది.
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. ఎన్నికల సమయంలో బీసీలకు హామీలిచ్చి.. అధికారంలోకి వచ్చాక వారికి కాంగ్రెస్ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని కవిత ధ్వజమెత్తారు. కామారెడ్డి డిక్లరేషన్ అమలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇప్పుడు అటకెక్కాయని విమర్శించారు. సావిత్రీ బాయి ఫూలే జయంతి సందర్భంగా సామాజిక న్యాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి గుర్తు చేయడానికి రేపు ఉదయం 11 గంటలకు ఇందిరా పార్కు వద్ద బీసీ మహాసభ నిర్వహిస్తున్నట్లు కవిత తెలిపారు. బీసీ మహాసభ పోస్టర్ను బుధవారం హైదరాబాద్లోని తన నివాసంలో కవిత ఆవిష్కరించారు.
The Congress government in Telangana has turned its back on the very people it vowed to uplift during the elections.
Two key promises that were made to for the BCs – The implementation of the Kamareddy Declaration and 42% reservations for BCs in local body elections— now lie… pic.twitter.com/3ku4djxVo4
— Kavitha Kalvakuntla (@RaoKavitha) January 2, 2025
ఇవి కూడా చదవండి..
CM Revanth Reddy | పది రోజులపాటు విదేశాల్లోనే.. సంక్రాంతి తర్వాత సీఎం ఫారిన్ టూర్
Telangana | జ్వరం నుంచి క్యాన్సర్ వరకు.. రాష్ట్రంలో విచ్చలవిడిగా నకిలీ మందులు
Srisailam | శ్రీశైలం విద్యుత్తు కేంద్రంలో లీకేజీ.. ఒకటో యూనిట్ వద్ద నీటిధారలు