సంగారెడ్డి : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా అందోల్లో మంత్రి హరీశ్ రావు, అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సమక్షంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు టీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి మంత్రి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు.
టీఆర్ఎస్లోనే పార్టీ కార్యకర్తలకు సరైన గుర్తింపు లభిస్తుందన్నారు. పార్టీలో చేరిన వారిలో హరినారాయణ , సుధాకర్ గౌడ్, సార శ్రీధర్, మంగళి భాగ్యం, క్రిష్ణాగౌడ్, అర్జున్ గౌడ్, బాగయ్య, భోజయ్య, సిద్ధయ్య, శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
ఇండియాలో ఒమిక్రాన్ కేసు నమోదు కాలేదు: రాజ్యసభలో ఆరోగ్యశాఖ మంత్రి
Electric shock | కరెంట్ షాక్తో ఎలక్ట్రీషియన్ మృతి
కేంద్ర మంత్రులు చెప్పేవన్నీ అబద్ధాలే : మంత్రి హరీశ్రావు