హైదరాబాద్ : చారిత్రాత్మక జహంగీర్ పీర్ దర్గా విస్తరణ, అభివృద్ధి, మక్కా మసీదు మరమ్మతులు, పునరుద్ధరణ పనుల్ని మరింత వేగవంతం చేయాలని సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు. జె.పి,మౌలాలీ, పహాడీ షరీఫ్ దర్గాలు, మక్కా మసీదు, అనీసుల్ గుర్భాలలో కొనసాగుతున్న పనులు..కోకాపేటలో క్రిస్టియన్ భవన్ నిర్మాణం విషయంలో నెలకొన్న అడ్డంకులను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
వీటికి సంబంధించి మంగళవారం మంత్రి తన క్యాంపు కార్యాలయంలో సుమారు రెండు గంటల పాటు ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. సీఎం కేసీఆర్ జెపి దర్గాను సందర్శించి, దాని విస్తరణ, అభివృద్ధికి హామీనిచ్చి నిధులు మంజూరు చేశారన్నారు. ముఖ్యమంత్రి ప్రాధాన్యత అంశాలలో ఇది ఒకటన్న విషయాన్ని మంత్రి కొప్పుల అధికారులకు మరోమారు గుర్తు చేశారు.
దీని విస్తరణకు సంబంధించిన భూసేకరణ పనులను మైనారిటీ సంక్షేమ శాఖాధికారులతో సమన్వయం చేసుకుంటూ తక్షణమే పూర్తి చేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయకుమార్ను ఆదేశించారు. నగరంలో వక్ఫ్ బోర్డు కు చెందిన 11విలువైన ఆస్తులను ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా ఈ-టెండర్ ప్రక్రియ ద్వారా లీజుకు ఇచ్చేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కొప్పుల అధికారులను ఆదేశించారు.
అనంతరం త క్రిస్టియన్ భవన్ నిర్మాణం విషయంలో నెలకొన్న అడ్డంకులను తొలగించడానికి మంత్రి గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంలో ఇద్దరు మంత్రులు అధికారులతో సమీక్ష జరిపారు. కోకాపేటలో క్రిస్టియన్ భవన్ కోసం కేటాయించిన స్థలం విషయంలో ఉప్పెర (సగర ) సంఘం నాయకులు కోర్టులో కేసు వేసిన విషయాన్ని అధికారులు మంత్రులకు వివరించారు.
సంఘం నాయకులతో మాట్లాడి కేసును వెనక్కి తీసుకునేలా వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి గంగుల బిసి సంక్షేమ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశానికి పలు సూచనలు చేశారు.
ఇవి కూడా చదవండి..
ఇండియాలో ఒమిక్రాన్ కేసు నమోదు కాలేదు: రాజ్యసభలో ఆరోగ్యశాఖ మంత్రి
Electric shock | కరెంట్ షాక్తో ఎలక్ట్రీషియన్ మృతి
కేంద్ర మంత్రులు చెప్పేవన్నీ అబద్ధాలే : మంత్రి హరీశ్రావు