హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి(BRS) పార్టీలో ఎలా చేరాలని మహారాష్ట్రకు చెందిన ఓ అభిమాని ప్రశ్న వేశారు. సాగర్ వరదే(Sagar Varad) అనే వ్యక్తి తన ట్విట్టర్ ద్వారా ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)ను అడిగారు. ఆ ట్వీట్కు ఎమ్మెల్సీ కవిత రిప్లై ఇచ్చారు. దేశవ్యాప్తంగా జరిగే పబ్లిక్ మీటింగ్లు, ప్రోగ్రామ్ల్లో నేరుగా పాల్గొని సీఎం కేసీఆర్కు, బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని ఆ అభిమానికి ఎమ్మెల్సీ కవిత సూచించారు. కాంటాక్ట్ డిటేల్స్ను నేరుగా పంపాలని, బీఆర్ఎస్లో స్వాగతించేందుకు సంతోషిస్తున్నామని ఎమ్మెల్సీ కవిత తన ట్వీట్లో తెలిపారు. రాబోయేది కిసాన్ సర్కార్ అని, బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలని ఆమె కోరారు.
Sagar Ji, you can support our leader and Hon’ble CM KCR Garu and @BRSparty by joining us in our public meetings and programs across the country.
DM your contact details. We are happy to welcome you 😊 #AbkiBaarKisaanSarkar https://t.co/TnBdaB8r6D
— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 20, 2023
తెలంగాణ మాదిరిగా దేశంలో కిసాన్ సర్కార్ ఏర్పడాలంటే కేసీఆర్ నాయకత్వం దేశానికి ఎంతో అవసరమన్న ఎమ్మెల్సీ కవిత అన్నారు. దేశవ్యాప్తంగా ప్రజానీకం సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ విధానాలకు ఆకర్షితులవుతున్నారడానికి సాగర్ నిదర్శనమని కవిత తెలిపారు.
ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నాందేడ్ లో నిర్వహించిన బహిరంగ సమావేశం మహారాష్ట్ర ప్రజానీకంపై గణనీయమైన ప్రభావం చూపిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు దేశవ్యాప్తంగా అమలు కావాలని అన్ని రాష్ట్రాల ప్రజల ఆకాంక్ష అని, అది కేసీఆర్తోనే సాధ్యమనే నమ్మకం ప్రజల్లో ఏర్పడిందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.