Omicron cases in Telangana |తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఒక్కరోజే కొత్తగా 14 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 38కి చేరింది. గడిచిన 24 గంటల్లో ఎట్ రిస్క్ దేశాల నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి 259 మంది వచ్చారు. వీరికి ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయగా నలుగురికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో పాజిటివ్ వచ్చిన వారి శాంపిల్స్ను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపించారు.
ఇప్పటివరకు ఎట్ రిస్క్ దేశాల నుంచి 9,381 మంది ప్రయాణికులు హైదరాబాద్కు వచ్చారు. వారందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా.. 63 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. వీరి శాంపిల్స్ను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపించగా.. 38 మందికి ఒమిక్రాన్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. మరో నలుగురి ఫలితాలు రావాల్సి ఉంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Omicron variant symptoms | గొంతులోనే వైరస్.. ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలివే..
కరోనా గత వేరియంట్లతో ఊపిరి ఆడకపోయేది.. ఒమిక్రాన్లో ఈ లక్షణం ఎందుకు లేదు?
ఒమిక్రాన్తో కరోనా వైరస్ అంతం కాబోతుందా? శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు?
Omicron | దేశంలో ఒమిక్రాన్ విజృంభణ.. 200కు పెరిగిన కేసులు
Omicron | బూస్టర్ డోస్ తీసుకున్న ముగ్గురికి ఒమిక్రాన్ పాజిటివ్
Omicron | అమెరికాలో తొలి ఒమిక్రాన్ మరణం నమోదు
Omicron | రాజన్న సిరిసిల్లలో ఒమిక్రాన్ తొలి కేసు నమోదు