జనగామ : జిల్లా ప్రధాన దవాఖానలో గురువారం జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కరోనా టీకా రెండో డోసు వేయించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వ్యాక్సినేషన్ పై ప్రజల్లో అపోహ ఉందన్నారు. ఇది సరైంది కాదని ఆయన తెలిపారు.
వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల కరోనా మహమ్మారి నుంచి సురక్షితంగా బయట పడవచ్చు ముత్తిరెడ్డి తెలిపారు. ప్రతి ఒక్కరు టీకా వేయించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. అలాగే మాస్కులు ధరిస్తూ.. శానిటైజ్ వాడుతూ.. భౌతిక దూరం పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఇవి కూడా చదవండి..
కరోనా ఉధృతిపై వరంగల్లో మంత్రుల సమీక్ష
మానవత్వాన్ని చాటుకున్న సూపర్ స్టార్..!
సమన్వయంతో పని చేద్దాం..కరోనాను తరిమేద్దాం
ఇండియాకు ఆక్సిజన్ కోసం ఓవర్టైమ్ పని చేస్తున్నాం: చైనా