వరంగల్ : కరోనా వైరస్ మహమ్మారి ఉధృతంగా ఉన్న నేపథ్యంలో నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొవిడ్ తీవ్రత, నివారణ చర్యలు, వసతులపై రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్ వరంగల్ రూరల్ కలెక్టర్ కార్యాలయం నుంచి 5 జిల్లాల కలెక్టర్లు, జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా కట్టడి కోసం పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని అధికారులకు మంత్రులు సూచించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, వరంగల్ రూరల్ కలెక్టర్ హరిత, జిల్లా అధికారులు పాల్గొన్నారు.