ఎల్లుండి నుంచి రైతుబంధు జమ | రాష్ట్రంలోని అర్హులైన రైతుల ఖాతాల్లో ఎల్లుండి నుంచి రైతుబంధు పథకం కింద నగదు జమ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది.
అదనపు కలెక్టర్లకు కొత్త కార్లు | రాష్ట్రంలోని అదనపు కలెక్టర్లకు కొత్త కార్లు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు (32 కియా కార్ల)ను ఉన్నతాధికారులు ప్రగతి భవన్కు తెప్పించారు.
తెలంగాణకు రెండు రోజుల వర్ష సూచన | తెలంగాణ వ్యాప్తంగా ఆది, సోమవారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
సినారెకు సీఎం కేసీఆర్ నివాళి | జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సినారె వర్ధంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సాహితీ రంగానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు.
మానేరు అభివృద్ధికి రూ. 310 కోట్లు విడుదల | లోయర్ మానేరు నది సుందరీకరణ, పటిష్ట పనుల నిర్వహణ కోసం ప్రభుత్వం చేపట్టిన మానేరు రివర్ ఫ్రంట్లో భాగంగా నాలుగు కిలోమీటర్ల మేర రిటైనింగ్ వాల్ నిర్మాణానికి రూ. 310.464 కోట్ల
వేతన సవరణ ఉత్తర్వులు జారీ | ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఉద్యోగులకు వేతన సవరణ అమలు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులను జారీ చేసింది.
ఉరేసుకొని ఆత్మహత్య | మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలో విషాద ఘటన జరిగింది. కరోనాతో భర్త మృతి చెందడంతో తీవ్ర మనోవేదనకులోనై భార్య సైతం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.