శ్రీనగర్కాలనీ/ బంజారాహిల్స్, సెప్టెంబర్ 2: నమస్తే తెలంగాణ సీఎండీ దీవకొండ దామోదర్రావు తండ్రి నారాయణరావు (92) తుదిశ్వాస విడిచారు. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 8లోని దామోదర్రావు నివాసంలో గురువారం ఉదయం 7.45 నిమిషాలకు ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మద్దునూర్ గ్రామానికి చెందిన నారాయణరావు గతంలో సింగిల్ విండో (పీఏసీఎస్) చైర్మన్గా వ్యవహరించారు. మాజీమంత్రి జువ్వాడి రత్నాకర్రావు, రాజేశ్వర్రావుకు ఈయన సమకాలీకుడు. నారాయణరావుకు ఇద్దరు కుమారులు దామోదర్రావు, వెంకటేశ్వరరావు, ముగ్గురు కుమార్తెలు అరుణ, లీల, అరుంధతి. నారాయణరావు భౌతికకాయానికి మధ్యాహ్నం జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు. పెద్ద కుమారుడు దామోదర్రావు శాస్ర్తోక్తంగా అంతిమ సంస్కారం నిర్వహించారు. కుటుంబసభ్యులు వెంకట్రావు, రాఘవరావు, బంధువులు అశ్రునయనాలతో తుది వీడ్కోలు పలికారు.
ప్రముఖుల నివాళి
నారాయణరావు భౌతికకాయాన్ని ఆర్థికశాఖ మంత్రి టీ హరీశ్రావు, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, ఐజీ ప్రభాకర్రావు, ఆర్టీఐ కమిషనర్ కట్టా శేఖర్రెడ్డి, బార్ కౌన్సిల్ సభ్యుడు గండ్ర మోహన్రావు, ప్రతిమ గ్రూప్ చైర్మన్ శ్రీనివాస్రావు, యశోద హాస్పిటల్ ఎండీ సురేందర్, డైరెక్టర్ దేవేందర్రావు, ఆదిత్య హోమ్స్ ఎండీ కోటారెడ్డి, రెడ్డిల్యాబ్స్ రవీందర్, అఖిల భారత వెలమ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పీ శ్రీకాంత్, జువ్వాడి నర్సింగ్రావు, గండ్ర ప్రతాప్రావు, శంకర్రావు, శ్రీచరణ్, నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే బాధ్యులు, సిబ్బంది సందర్శించి నివాళి అర్పించారు.