సాంకేతిక ప్రపంచం వేగంగా పరిణామం చెందుతున్నది. ఒకప్పుడు ఉదోగాల సృష్టికి కేంద్రంగా ఉండే టెక్ రంగం ఇప్పుడు లక్షల మంది ఉద్యోగులను ఇంటికి పంపుతున్నది. ఈ ఏడాది లక్షకుపైగా ఉద్యోగులను కోల్పోవడం ఒక గణాంకం మాత్�
టెక్ సెక్టార్లో కృత్రిమ మేధ (ఏఐ) ప్రవేశం, దేశాల మధ్య నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు వెరసి ప్రపంచవ్యాప్తంగానే కాకుండా దేశీయంగానూ ఐటీ, ఐటీఈఎస్ సెక్టార్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది.
కరోనా సంక్షోభం, ఆర్థిక మాంద్యం పేరిట టెక్ కంపెనీల్లో మొదలైన ఉద్యోగాల కోత ఇంకా కొనసాగుతున్నది. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లోనే ఏకంగా లక్ష మందికి పైగా ఉద్యోగులకు సాఫ్ట్వేర్ కంపెనీలు ఉద్వాసన పలికాయి.
ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాల ఊచకోత 2023లోనూ కొనసాగనున్నది. గత నవంబర్లో 11వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపించిన ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఈ ఏడాది కూడా వేటు వేసేందుకు సిద్ధమవుతున్నది.