MRPS | మాదిగలను పార్లమెంట్కు వెళ్లకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటోందని ఎమ్మార్పీఎస్ చీఫ్ మందకృష్ణ మాదిగ ఆరోపించారు. ఈ మేరకు రాజ్యసభ సభ్యుడిగా మాదిగకి అవకాశమివ్వాలన్న డిమాండ్తో కాంగ్రెస్ కార్యాలయాల ముందు ధర్నాలకు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. ఈ రోజు 3 గంటలకు జిల్లా కాంగ్రెస్ కార్యాలయాల ముందు ధర్నాకు పిలుపునిచ్చారు.
ఇందులో భాగంగా సాయంత్రం 4 గంటలకు డీసీసీ అధ్యక్షులకు వినతి పత్రాలు ఇవ్వనున్నారు. రాజ్యసభ సభ్యుడిగా మాదిగకి అవకాశమివ్వాలని మందకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన రాహుల్ గాంధీకి మందకృష్ణ మాదిగ బహిరంగ లేఖ రాశారు.
తెలంగాణలో మాదిగలకు రాజ్యసభ సీటు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. లోక్ సభ ఎన్నికల్లో కూడా మాదిగలకు టికెట్ ఇవ్వలేదని లేఖలో పేర్కొన్న మందకృష్ణ పార్లమెంట్లో తెలంగాణ నుండి మాదిగల ప్రాతినిధ్యమే లేదన్నారు. తెలంగాణ నుండి మాదిగలు పార్లమెంట్లో లేకుండా చేసే కుట్ర చేస్తున్నారని.. సీడబ్ల్యూసీ లో ఒక్క మాదిగ కూడా లేరని ఆరోపించారు.
Pahalgam Attack: పెహల్గామ్ ఉగ్రదాడి.. చైనా సాయం కోరిన ఎన్ఐఏ కోర్టు
Dragon | మే 20న ‘డ్రాగన్’ విస్ఫోటనం .. ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ కోసం మేకర్స్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు!
Sircilla | సిరిసిల్ల జిల్లాలో ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి.. 10 మందికి గాయాలు