కట్టంగూర్, మార్చి 04 : ప్రస్తుత వేసవిలో నర్సరీల్లో పెంచుతున్న మొక్కలు ఎండిపోకుండా ఎప్పటికప్పుడు నీరందించాలని కట్టంగూర్ సర్పంచ్ ముక్కామల శ్యామల శేఖర్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని నర్సరీని సందర్శించి అందులోని మొక్కలను పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మొలకలు రాని బ్యాగ్లలో మళ్లీ గింజలు నాటాలన్నారు. ఎదుగుతున్న మొక్కలను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం అంబేద్కర్ నగర్ లోని అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి భోజనం, సరుకుల నాణ్యతతో పాటు పౌష్టికాహారాన్ని పరిశీలించి హాజరయ్యే పిల్లల వివరాలను అడిగి తెలుసుకున్నారు. గర్భిణీలు, బాలింతలతో పాటు పిల్లలకి అందించే పోషకాహారాలను సక్రమంగా అందించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో మెరుగైన సేవలందించాలని పేర్కొన్నారు. ఆమె వెంట పంచాయతీ కార్యదర్శి వడ్లకొండ అశోక్ గౌడ్, గ్రామ పంచాయతీ సిబ్బంది ఎరుకల సత్తయ్య, కానుగు వెంకన్న, అంగన్వాడీ టీచర్ ఉన్నారు.

నర్సరీలో మొక్కలు ఎండిపోకుండా నిరందించాలి : కట్టంగూర్ సర్పంచ్ శ్యామల