తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవికి వాకిటి సునీతా లక్ష్మారెడ్డి రాజీనామా చేశారు. దీంతో ఆమె రాజీనామాను ఆమోదిస్తూ గురువారం సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
బీఆర్ఎస్ పార్టీ నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సునీతా లక్ష్మిరెడ్డిని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు బుధవారం ఎమ్మెల్యే మదన్రెడ్డితో కలిసి ఆమెకు బీఫామ్ అందజేశారు.