బీఆర్ఎస్ పార్టీతోనే తెలంగాణలో సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. పోరాటాలు చేసి సాధించిన తెలంగాణలో అభివృద్ధి సంక్షేమం కొనసాగాలంటే కేసీఆర్ను హ్యాట్రిక్ ముఖ్యమంత్రిని చేయాలన్నారు. శనివారం వెల్దుర్తితోపాటు మండలంలోని బండమీదిపల్లి, శంశిరెడ్డిపల్లి, హస్తాల్పూర్, నెల్లూర్, పెద్దాపూర్, చర్లపల్లి, ఎలుకపల్లి, మంగళపర్తి, మానేపల్లి గ్రామాల్లో స్థానిక బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమె ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది.
వెల్దుర్తి, నవంబర్ 25: పోరాటాలు చేసి సాధించిన తెలంగాణలో సంక్షేమం, అభివృద్ధి కొనసాగాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలని నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. శనివారం వెల్దుర్తితోపాటు మండలంలోని బండమీదిపల్లి, శంశిరెడ్డిపల్లి, హస్తాల్పూర్, నెల్లూర్, పెద్దాపూర్, చర్లపల్లి, ఎలుకపల్లి, మంగళపర్తి, మానేపల్లి గ్రామాల్లో స్థానిక బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో వారు మాట్లాడుతూ ఎన్నో ఆశలతో ఏర్పాటు చేసుకున్న తెలంగాణలో అంతకుముందు లేని అభివృద్ధిని తొమ్మిదిన్నర ఏండ్లలో చేసుకున్నామన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలుచేస్తున్న రాష్ట్రం తెలంగాణ అన్నా రు. ఎన్నో దశాబ్దాల కల అయిన వెల్దుర్తి పట్టణ రోడ్డు వెడల్పును స్వరాష్ట్రంలో చేసుకున్నామన్నారు. రోడ్డు వెడల్పులో ఇండ్లు, దుకాణాలు కోల్పోయిన బాధితులకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చి ఆదుకున్నామన్నారు. హల్దీవాగుపై వెల్దుర్తి మండలంతోపాటు కొల్చారం మండలంలో చెక్డ్యాంలు నిర్మించుకున్నామని, ఎండాకాలంలో కాళేశ్వరం జలాలు విడుదల చేయడంతోపాటు పరీవాహక ప్రాంతంలోని పొలాలు, చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోని చెరువులు, భూగర్భజలాలు భారీగా పెరిగాయన్నారు.
24 గంటల ఉచిత విద్యుత్తో బీడులుగా ఉన్న పొలాల్లో నేడు పచ్చని పంటలు పండుతున్నాయన్నారు. పోడు భూములకు పట్టాలు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. త్వరలోనే అసైన్డ్ భూముల చట్టం తెచ్చి కాస్తులో ఉన్న రైతులకు పట్టాలు ఇచ్చి వారికి హక్కులు కల్పిస్తామన్నారు. రైతులకు సంబంధించిన అన్ని పథకాలను అమలు చేస్తామని వారు తెలిపారు. ప్రతి ఇంటికి బీమా సౌకర్యం, మహిళలకు జీవన భృతి, గ్యాస్ ధరల తగ్గింపు వంటి ఎన్నో పథకాలు ప్రభుత్వం మీ ముందుకు తెస్తున్నదన్నారు. అన్ని వర్గాలను ఆదుకుంటూ సంక్షేమ పథకాలను గడపగడపకూ అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సబ్బండ వర్గాలకు అండగా నిలుస్తున్నారన్నారు. ప్రతిపక్షాలు వారి పాలనలో గుర్తుకు రాని పథకాలను నేడు మేము అందిస్తామంటూ ఎన్నికల్లో ప్రజల ముందుకు వస్తున్నారని, అప్పుడు చేత కాని పథకాలు నేడు ఎలా చేస్తారని వారు ప్రశ్నించారు. రాజకీయ పబ్బం గడుపుకోవడానికి, పదవులు పొందడానికి సాధ్యం కాని, చేతకాని హామీలను ఇస్తామంటూ ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు. వారిని నమ్మి మోసపోతే మరో 20 ఏండ్లు వెనక్కి పోతామన్నారు. గత రెండుసార్లు ఎన్నికైన బీఆర్ఎస్ ప్రభుత్వం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అమలుచేస్తున్న పథకాలను గుర్తించాలన్నారు. అంతకుముందు చేతకాని ప్రతిపక్షాలు నేడు ఇస్తామనే విషయాన్ని సైతం ప్రజలు గుర్తించి, పని చేస్తున్న ప్రభుత్వాన్ని మరోసారి దీవించి కారు గుర్తుకు ఓటువేసి సునీతాలక్ష్మారెడ్డిని గెలిపించి, కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రి చేయాలన్నారు.
ప్రచారంలో భాగంగా గ్రామాలకు వచ్చిన బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మదన్రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళలు, ప్రజలు బ్రహ్మరథం పట్టారు. గ్రామం వెలుపల నుంచి డప్పుచప్పుళ్లు, బ్యాండు బాజాలు, డోలు వాయిద్యాలతో పటాకులు కాల్చుతూ, నృత్యాలు చేస్తూ, జై తెలంగాణ, జై కేసీఆర్, కారు గుర్తుకే మన ఓటు, బీఆర్ఎస్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ ఘనంగా స్వాగతం పలికారు. అభివృద్ది, సంక్షేమ పథకాలను సునీతాలక్ష్మారెడ్డి, మదన్రెడ్డి వివరించినప్పుడు చప్పుట్లు, నినాదాలు చేస్తూ మద్దతు పలికారు. వెల్దుర్తిలో కుడిచెరువు నుంచి స్థానిక అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన ప్రజలు, మహిళలు, బీఆర్ఎస్ నాయకులతో ప్రధాన రోడ్డు కిక్కిరిసిపోయింది. ప్రచార కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భూపాల్రెడ్డి, జడ్పీటీసీ రమేశ్గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ అనంతరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రతాప్రెడ్డి, ఎంపీటీసీ మోహన్రెడ్డి, సర్పంచ్లు భాగ్యమ్మ ఆంజనేయులు, మమతా పాండురంగం, లక్ష్మి, అశోక్రెడ్డి, నాయకులు నర్సింలు, రాజిరెడ్డి, కృష్ణాగౌడ్, శ్రీనివాస్రెడ్డి, అశోక్రెడ్డి, శేఖాగౌడ్, గంగాధర్, శాఖారంశ్రీను, వెంకటేశం, సత్యనారాయణగౌడ్, రంగారెడ్డి, విష్ణు, మహిపాల్రెడ్డి, నర్సింహారెడ్డి, సోమప్ప, స్వామి, మల్లేశం, శ్రీధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.