రైతుల పరిస్థితి కడుదయనీయంగా మారుతోంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలాలు అడుగంటాయి. బోర్లల్లో నీరు ఇంకిపోతున్నది. మరికొన్నింట్లో చుక్క నీళ్లు రావడం లేదు. దీంతో యాసంగిలో సాగు చేసిన పంటలను కాపాడుక�
నాగార్జున సాగర్ ఎడమ కాల్వ కింద ఉన్న రైతులు గతంలో మునుపెన్నడూ లేనివిధంగా ఈ ఏడాది విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కేసీఆర్ పాలనలో దర్జాగా వరి సేద్యం చేసిన రైతులు నేడు అరిగోస పడుతున్నారు.
చెరువుల్లో రోజు రోజుకూ నీటి మట్టం తగ్గుతూ జలకళను కోల్పోతున్నాయి. గతంలో ఎండాకాలంలో సైతం నీటితో కళకళలాడిన చెరువులు మార్చి చివరి వరకు చెరువుల్లో నీళ్లు అడుగంటుతున్నాయి.
ఈ ఏడాది లోటు వర్షపాతం, ప్రాజెక్టుల్లో కరువైన నీటి లభ్యత కారణంగా జిల్లాలో భూగర్బ జలాలు రోజురోజుకూ పడిపోతున్నాయి. గత నెలలో 8.68 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ నీటి మట్టం.. ఈ నెలలో 10.06 మీటర్లకు పడిపోయింది.
వ్యవసాయ బోర్లలో భూగర్భ జలాలు వేగంగా పడిపో తున్నాయి. గత ఏడాది సమృద్ధిగా వర్షాలు కురవకపోవడంతో బోర్లలో నీటి మట్టాలు తగ్గుతున్నాయి. వ్యవసాయానికి గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల విద్యుత్ సరఫరా చేయడం,