కాబూల్ : తాలిబన్ల హెచ్చరికల నేపధ్యంలో ఆప్ఘనిస్ధాన్కు చెందిన 32 మంది మహిళా ఫుట్బాల్ ప్లేయర్లు కుటుంబాలతో కలిసి ఎమర్జెన్సీ వీసాతో పాకిస్తాన్ చేరుకున్నారు. జాతీయ జూనియర్ బాలికల టీమ్కు చెందిన వీరంతా ఫిపా వరల్డ్ కప్ కోసం ఖతార్లోని శిబిరానికి వెళ్లాల్సి ఉండగా ఆగస్ట్ 26న కాబూల్ విమానాశ్రయంలో జరిగిన బాంబు పేలుళ్లతో చిక్కుకుపోయారు.
ఫుట్బాల్ టోర్నీల్లో పాల్గొంటున్నారనే ఆగ్రహంతో తాలిబన్లు మహిళా ఫుట్బాల్ ప్లేయర్లు లక్ష్యంగా హెచ్చరికలు చేస్తుండటం ఆందోళన రేకెత్తించింది. తాలిబన్లు ఆప్ఘన్ను వశపరుచుకున్నప్పటి నుంచి మహిళా ఫుట్బాల్ ప్లేయర్లు అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇక 32 మంది మహిళా ఫుట్బాలర్లను పాకిస్తాన్కు తరలించాలని బ్రిటన్కు చెందిన ఎన్జీవో ఫుట్బాల్ ఫర్ పీస్ చొరవ చూపింది. ప్రభుత్వం, పాకిస్తాన్ ఫుట్బాల్ ఫెడరేషన్ సహకారంతో వీరందరికీ పాకిస్తాన్లో ఆశ్రయం కల్పించేలా చర్యలు చేపట్టింది.