హైదరాబాద్..కేటీఆర్కు మధ్య విడదీయరాని బంధం పెనవేసుకున్నది. ఇక్కడి ప్రజలు కేటీఆర్ను తమ ఇంట్లో వ్యక్తిగా స్వీకరించారు. ఒక్క క్లిక్తో సోషల్ మీడియాలో కేటీఆర్ ప్రజల సమస్యలను పరిష్కరించేవారు. ఎంతో మంది కష్టాలను తీర్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ కేటీఆర్ రోడ్ షోలతో నగరవ్యాప్తంగా ప్రచారం చేసి.. బీఆర్ఎస్ను గెలిపించారు. ఈ సారి కూడా లోక్సభ బరిలో కేటీఆర్ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ అభివృద్ధి ఫలాలు కేసీఆర్ పాలనలో ఎలా ఉన్నాయి? కాంగ్రెస్ పాలనలో ఎలా ఉన్నాయి? అనే అంశాలపై ఓటర్లను చైతన్యం చేస్తున్నారు.
కేటీఆర్ రోడ్ షోలకు ప్రజల్లోనూ విశేష స్పందన వస్తున్నది. తమ కండ్ల ముందే కేసీఆర్ చేసిన అభివృద్ధి కనిపిస్తుండటంతో బీఆర్ఎస్ అభ్యర్థులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. సీఎం రేవంత్రెడ్డి ప్రచార సభలు వెలవెలబోతుంటే.. కేటీఆర్ ప్రచార కార్యక్రమాలు మాత్రం జనంతో కిక్కిరిసిపోతున్నాయి. ఈ పరిస్థితులను బేరీజు వేసుకున్న కాంగ్రెస్ పెద్దలు లోక్సభ ఎన్నికల్లో ఓటమి తప్పదనే అంచనాకు వచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.