మర్పల్లి/చేవెళ్ల రూరల్, మే 5 : గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలంటూ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ను నమ్మి మరోసారి మోసపోవద్దని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ఎంసీఎం ఫంక్షన్ హాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు.
బీఆర్ఎస్లో పదవులు అనుభవించి పార్టీలు మారిన వారికి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని సూచించారు. ఈ ప్రాంత ప్రజలకు తెలియని రంజిత్రెడ్డిని కేసీఆర్ పిలుపు మేరకు ఎంపీగా గెలిపిస్తే మోసం చేసి కాంగ్రెస్లో చేరారన్నారు. బీఆర్ఎస్ నుంచి చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కాసాని జడ్పీ చైర్మన్గా ఉన్నప్పుడు రంగారెడ్డి జిల్లా అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు. కేసీఆర్ బస్సు యాత్రతో బీజేపీ, కాంగ్రెస్ నాయకుల్లో భయం పుట్టుకున్నదని ఆరోపించారు.
– బీఆర్ఎస్ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్
ఐదు నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. కరెంటు, తాగునీటి సమస్యలు మళ్లీ మొదలయ్యాయన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో జడ్పీ చైర్మన్గా పని చేసిన తనకు జిల్లావాసులతో మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. తనను భారీ మెజార్టీతో గెలిపిస్తే జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.
-మాజీ ఎమ్మెల్యే ఆనంద్
కాసాని గెలుపునకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని మాజీ ఎమ్మెల్యే ఆనంద్ పిలుపునిచ్చారు. రేవత్రెడ్డిపై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. దేవుండ్లపై ఒట్లు పెట్టి ఆగస్టు 15 వరకల్లా రైతు రుణమాఫీ చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉన్నదని, రుణమాఫీ చేయకపోతే రేవంత్రెడ్డి రాజీనామా చేయాలన్నారు. ఆరు గ్యారెంటీలలో ఒక్క హామీని కూడా సరిగ్గా నెరవేర్చలేదన్నారు. తాగునీరు, విద్యుత్తు సమస్యలు ఎక్కువయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, ఎంపీపీ లలితా రమేశ్, జడ్పీటీసీ మధుకర్, వైస్ ఎంపీపీ మోహన్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి, ఉపాధ్యక్షుడు అశోక్, యూత్ అధ్యక్షుడు మధుకర్, గఫార్, ఖాజా, సొసైటీ డైరెక్టర్ యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల పార్లమెంటు అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపే లక్ష్యంగా మండే ఎండలను సైతం లెకచేయకుండా రాష్ట్ర మాజీ విద్యాశాఖ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆదివారం ఆమె జన్మదినం సందర్భంగా చేవెళ్ల మండలంలోని స్వగ్రామం కౌకుంట్లలో ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. అంతకు ముందు దివంగత మాజీ హోంమంత్రి పట్లోళ్ల ఇంద్రారెడ్డి సమాధి వద్ద నివాళులర్పించారు. అనంతరం కౌకుంట్లలో ఇంటింటికీ తిరుగుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరిస్తూ కాసాని జ్ఞానేశ్వర్ను గెలిపించాలని ప్రజలను కోరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలు ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యాయన్నారు. ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ విఫలం కాగా, పదేండ్లలో బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు నయా పైసా సాయం చేయలేదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు గతంలో బీఆర్ఎస్ తరఫున నిలబడి ఎంపీలుగా గెలిచిన వారెనన్నారు. మూడోసారి బీసీల ముద్దుబిడ్డ కాసాని జ్ఞానేశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మాయమాటలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు.
డిసెంబర్ 9న రైతుబంధు రూ.15 వేలు, రూ.2 లక్షల రుణమాఫీ, రూ.4 వేల పింఛన్, మహిళలకు ఆర్థిక సాయం, యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామంటూ చేసిన వాగ్దానాలను గాలికొదిలేసిందన్నారు. తెలంగాణ వాణి పార్లమెంట్లో వినిపించాలంటే బీఆర్ఎస్ అభ్యర్థి కాసానిని గెలిపించాలన్నారు. మాజీ సీఎం కేసీఆర్ సభలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుండడంతో పాలక పక్షాలు గొంతునొకే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. 5 నెలల్లో రేవంత్ పరిపాలన చూసి కేసీఆర్ను ఎందుకు వదులుకున్నాం.. అని ప్రజలు బాధపడుతున్నారని గుర్తు చేశారు. కేసీఆర్ పాలనలో రెప్పపాటు కరెంట్ పోకుండే.. ఇప్పుడు తరుచూ పోతుందన్నారు.
96 బీసీ కులాలను ఏకం చేసిన గొప్ప నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ను గెలిపిస్తే పాలమూరు – రంగారెడ్డికి జాతీయ హోదా తీసుకొచ్చేందుకు పార్లమెంట్లో తన గళం విప్పి పోరాటం చేస్తారన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పదేండ్లలో తెలంగాణకు ఏమి చేయలేదని, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీలు ఎక్కడికి పోయాయని విమర్శించారు. ఒక విద్యాలయం కూడా ఇవ్వలేదని, పాలమూరు – రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వలేదన్నారు. కల్యాణలక్ష్మి పథకంతో రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. మాజీ సీఎం కేసీఆర్ కష్టాల్లో ఉన్న రైతుల వద్దకు వెళ్తే సీఎం రేవంత్రెడ్డి స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారని, ప్రజలు, రైతులపై ఆయనకు ఉన్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.
మండల పరిధిలోని ఆలూర్, అనుబంధ గ్రామం వెంకన్నగూడ గ్రామాల్లో ఆదివారం బీఆర్ఎస్ శ్రేణులు ఇంటింటికీ వెళ్లి ఫ్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ పట్ల్లోళ్ల కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ యువ నాయకుడు, సబితారెడ్డి తనయుడు కౌశిక్రెడ్డి, రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ పులుమామిడి నారాయణ, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రభాకర్, కౌకుంట్ల అంతారం మాజీ సర్పంచ్లు గాయత్రిగోపాలకృష్ణ, సులోచనాఅంజన్గౌడ్, బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు శేఖర్, సర్పంచ్ల సంఘం మండల మాజీ అధ్యక్షుడు శేరి శివారెడ్డి, ఈర్లపల్లి మాజీ ఉప సర్పంచ్ కొల్లగల్ల స్వర్ణలతాభాస్కర్, స్థానిక బీఆర్ఎస్ నాయకులు మల్లారెడ్డి, శివ, బీఆర్ఎస్ నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు వంగ శ్రీధర్రెడ్డి, ఆలూర్ మాజీ ఉప సర్పంచ్లు కసిరె వెంకటేశ్, కొల్లగల్ల స్వర్ణలతాభాస్కర్, మాజీ సర్పంచ్లు నరహరిరెడ్డి, నర్సింహులు, లావణ్యశంకర్, భానుతేజ, మాజీ వార్డు సభ్యుడు పాండు, ఇరు గ్రామాలకు చెందిన ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.