ODI World Cup 2023 : భారత గడ్డపై జరుగుతున్న వన్డే వరల్డ్ కప్లో శనివారం కీలక మ్యాచ్లు జరుగుతున్నాయి. డబుల్ హెడర్(Double Header)లో భాగంగా బెంగళూరు వేదికగా తలపడుతున్న పాకిస్థాన్, న్యూజిలాండ్ సెమీస్ బెర్తుపై కన్నేశాయి. ఇక అహ్మదాబాద్లో మధ్యాహ్నం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ను ఢీకొననుంది. వరుసగా నాలుగు విజయాలతో జోరుమీదున్న కమిన్స్ సేన ఈ మ్యాచ్ గెలిస్తే.. 10 పాయింట్లతో సెమీస్ రేసులో ముందుడుగేస్తుంది. కివీస్ కూడా పాక్ను భారీ తేడాతో ఓడిస్తే.. 10 పాయింట్లతో పోటీలో ఉంటుంది.
సొంతగడ్డపై ఎదురన్నదేలేని భారత జట్టు ఏడు మ్యాచుల్లో ఏడింట గెలిచి సెమీస్లో పాగా వేసింది. 12 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా ఇంకొక మ్యాచ్లో విజయం సాధిస్తే.. సెమీస్ బెర్తు ఖరారవ్వడం ఖాయం. ఇక మిగిలిన రెండు బెర్తులకు.. చెరో 8 పాయింట్లతో మూడు, నాలుగో స్థానాల్లో నిలిచిన ఆసీస్, కివీస్ ప్రధాన పోటీదారుగా నిలిచాయి.
బెంగళూరులో జరుగుతున్న న్యూజిలాండ్, పాకిస్థాన్ మ్యాచ్కు వరుణుడి ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ చెప్తోంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయినా, టైగా ముగిసినా సెమీస్ రేసు మరింత ఆసక్తికరంగా మారనుంది. లీగ్ దశ మ్యాచ్లకు రిజర్వ్ డే లేకపోవడంతో ఇరుజట్లకు చెరొక పాయింట్ కేటాయిస్తారు. అదే జరిగేతే… 7 పాయింట్లతో పాక్ సెమీస్ రేసు నుంచి తప్పుకుంటుంది. ఇక.. కివీస్ 9 పాయింట్లతో రేసులోనే ఉంటుంది.
అఫ్గనిస్థాన్
ఆసీస్ గనుక ఇంగ్లండ్ను చిత్తుగా ఓడిస్తే.. 10 పాయింట్లతో సెమీస్ బెర్తుకు మరింత చేరువవుతుంది. ఒకవేళ ఇంగండ్ గెలిచిందనుకో అఫ్గనిస్థాన్ రేసులోకి వచ్చే చాన్స్ ఉంది. అవును.. ఇప్పటికే డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్, పాకిస్థాన్, శ్రీలంకను ఓడించి సంచలనం సృష్టించిన అఫ్గనిస్థాన్ 8 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. అయితే.. సెమీస్ బెర్తుపై కన్నేసిన అఫ్గన్ జట్టుకు నవంబర్ 7న ఆసీస్తో పెద్ద పరీక్ష ఎదురుకానుంది. ఆ మ్యాచ్లో కాబూలీలు అద్భుతం చేస్తే.. కంగారూల సెమీస్ ఆశలు అడియాశలు అయినట్టే.