టోక్యో ఒలింపిక్స్ హీరో నీరజ్ చోప్రా.. ఆ మెగాటోర్నీ తర్వాత కూడా అద్భుతమైన ప్రదర్శనలతో ప్రపంచ పటంపై భారత కీర్తిని పెంచుతూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే తాజాగా వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో కూడా సత్తా చాటాడు. రెండో స్థానంలో నిలిచి వెండి పతకం సాధించాడు. ఈ క్రమంలో దేశం నలుమూలల నుంచి నీరజ్కు అభినందనలు వెల్లువెత్తాయి. టీమిండియా మాజీ సారధి విరాట్ కోహ్లీ కూడా నీరజ్ విజయంపై ప్రశంసలు కురిపించాడు.
‘‘ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్స్లో సిల్వర్ మెడల్ సాధించినందుకు నీరజ్కు కంగ్రాట్స్. నిన్ను చూస్తుంటే మా అందరికీ గర్వంగా ఉంది’’ అంటూ ట్వీట్ చేశాడు. ఈ మెగా టోర్నీలో 88.13 మీటర్ల త్రో విసరడం ద్వారా నీరజ్ రెండో స్థానం కైవసం చేసుకున్నాడు. దీంతో వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో పతకం సాధించిన తొలి భారత క్రీడాకారుడిగా రికార్డు సృష్టించాడు.
Congratulations @Neeraj_chopra1 on winning the silver at the World Athletics Championships. We are proud of you. 🇮🇳👏
— Virat Kohli (@imVkohli) July 24, 2022