కరీంనగర్కు చేరిన ఆర్ఎఫ్సీఎల్ యూరియా
450 బ్యాగులు రాక.. ఒక్కో బస్తా నెట్వెయిట్ 45 కేజీలు
గరిష్ఠ విక్రయ ధర 266.50
ఫలించిన ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ
మౌలిక సదుపాయాలు, నిర్మాణానికి అండదండలు
వచ్చే నెల నుంచి పూర్తి స్థాయిలో ఉత్పత్తి
కరీంనగర్/పెద్దపల్లి, మార్చి 29 (నమస్తే తెలంగాణ): ఆర్ఎఫ్సీఎల్ కిసాన్ బ్రాండ్ యూరియా కమర్షియల్ ఉత్పత్తి మార్కెట్లోకి చేరింది. ఏటా 12.5లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఆరు సంస్థల భాగస్వామ్యంతో రామగుండంలో నిర్మించిన రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిడెట్ (ఆర్ఎఫ్సీఎల్) పూర్తిస్థాయిలో సిద్ధమైంది. రామగుండంలో రెండు దశాబ్దాలపాటు బొగ్గు ఆధారితంగా నడిచి నష్టాలతో మూతపడిన రామగుండం ఎరువుల కార్మాగారం (ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-ఎఫ్సీఐ) స్థా నంలో గ్యాస్ ఆధారితంగా ఆరు సంస్థల భాగస్వామ్యంతో ఈ ఫ్యాక్టరీని నిర్మించారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి 11 శాతం వాటా ఉంది.
రాష్ట్ర సర్కారు అండదండలతోనే..
నిజానికి దేశంలో ఐదు కర్మాగారాల పునరుద్ధరణ కు కేంద్రం చర్యలు తీసుకున్నా ఇందులో తొ లుత ఆర్ఎఫ్సీఎల్ ఫ్యాక్టరీయే త్వరగా పూర్తికావడం వెనుక రాష్ట్ర సర్కారు కృషి ఎంతో ఉన్నది. మౌళిక సదుపాయాల కల్పనకు సహకరించడంతో పాటు స్థానికంగా ఉండే అవాంతరాలను తొలగిస్తూ నిర్మాణానికి కావాల్సిన స్వేచ్ఛను కల్పించింది. నిర్మాణ సమయంలో ఎదురైనప్రతి అవరోధాన్ని పూర్తిగా తొలగించి సంబంధిత సంస్థలకు అండగా నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను ఎప్పటికప్పుడు పెడుతూ మిగిలిన సంస్థలను కూడా ప్రోత్సహించడం వల్లే ఫ్యాక్టరీలో ఉత్పత్తిని ప్రారంభించేందుకు ఆస్కారం ఏర్పడింది.
ఉత్పత్తిలో సగం మనకే..
ప్లాంట్లో ప్రతి రోజూ 2200 మెట్రిక్ టన్నుల అమ్మోనియా, 3850మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి కానుండగా, ఇక్కడ ఉత్పత్తి అయ్యే దా నిలో సగం మన రాష్ట్ర రైతాంగానికే అందించనున్నారు. మిగిలిన సగం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ర్టాలకు కేటాయించే అవకాశం ఉంది. దేశంలో అవసరానికి సరిపడా ఎరువుల ఉత్పత్తి జరుగకపోవడంతో విదేశాల నుంచి దిగుమతి చే సుకుంటున్నారు. ఈ తిప్పలు తప్పించాలన్న ల క్ష్యంతో కేంద్రం దేశంలో మూతపడ్డ ఐదు కర్మాగారాల పునరుద్ధరణకు చర్యలు చేపట్టింది. అందు లో మెట్టమొదటగా ఆర్ఎఫ్సీల్ తన ఉత్పతిని ప్రా రంభించింది. బస్తా గ్రాస్ వెయిట్ 45.125 కేజీలు కాగా, నెట్ వెయిట్ 45 కేజీలతో బస్తా ఎమ్మార్పీ 266.50గా పేర్కొంటూ తొలి ఉత్పత్తిని తిరుమల తిరుపతి వెంకన్నకు అందించగా, కమర్షియల్గా వివిధ ప్రాంతాలకు తరలించారు.
కరీంనగర్కు యూరియా
ఆర్ఎఫ్సీఎల్లో ఉత్పత్తి అవుతున్న యూరియా ను మొదటి సారి కరీంనగర్ జిల్లాకు కేటాయించారు. కరీంనగర్కు చెందిన రాష్ట్ర ఫర్టిలైజర్ అసోసియేషన్ అధ్యక్షుడు, హోల్సేల్ డీలర్ గౌరిశెట్టి మునీందర్కు తొలిసారి 22 టన్నులు (450 బస్తా లు) కేటాయించగా, సోమవారం మునీందర్తోపాటు డీఏవో శ్రీధర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మునీందర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తన వాటా వెచ్చించి, మౌళిక సదుపాయాలను క ల్పించిందన్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆర్ఎఫ్సీఎల్ను త్వరగా ప్రారంభించారని చె ప్పారు. తొలి ఉత్పత్తి తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళంగా అందించిన తర్వాత కమర్షియల్గా మొదటి సారి కరీంనగర్ జిల్లాకు 450 బస్తా లు కేటాయించారన్నారు. వచ్చే నెలలో పూర్తి ఉత్పత్తి ప్రారంభించిన తర్వాత రిజిస్ట్రర్ చేయించుకున్న డీలర్లకు యూరియా సరఫరా చేస్తారన్నారు.
కొరత తీరుతుంది: డీఏవో శ్రీధర్
ఆర్ఎఫ్సీఎల్ ఎరువుల ఉత్పత్తితో జిల్లా రైతుకు యూరియా కొరత తీరుతుందని జిల్లా వ్యవసాయ అధికారి వాసిరెడ్డి శ్రీధర్ పేర్కొన్నారు. గతంలో ఎరువుల కోసం రైతులు ఎన్నో కష్టాలు పడేవారని, కాళేశ్వరం తదితర ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చిన క్రమంలో సాగు విస్తీర్ణం విపరీతంగా పెరుగుతున్నదని, సమయానుకూలంగా ఆర్ఎఫ్సీఎల్ ఎరువులను పునరుత్పత్తి చేస్తోందన్నారు. రాబోయే రోజుల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. ఆర్ఎఫ్సీఎల్ను త్వరగా పునరుద్ధరించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు.
ఇవి కూడా చదవండి
ఊరంతా కప్పేసిన మంచు దుప్పటి..!
లండన్లో ప్రియాంక చోప్రా హోలీ సంబురాలు