ICC : అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) గురువారం ‘వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2023’ (ODI Player Of The Yearr)అవార్డు నామినీస్ను ప్రకటించింది. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు కోసం ఈసారి భారత క్రికెటర్ల(Indian Cricketers) మధ్యనే గట్టి పోటీ నెలకొంది. అవును.. టీమిండియా నుంచి ఈ అవార్డుకు ఏకంగా ముగ్గురు పోటీపడుతున్నారు.
వరల్డ్ కప్(ODI World Cup)లో చెలరేగిన విరాట్ కోహ్లీ(Virat Kohli), మహ్మద్ షమీ(Mohammad Shami), యువ ఓపెనర్ శుభ్మన్ గిల్(Shubman Gill). ఇక గత ఏడాది నిలకడగా రాణించిన న్యూజిలాండ్ ఆల్రౌండర్ డారిల్ మిచెల్(Daryl Mitchell) కూడా బరిలో నిలిచాడు.
Who should be the ODI player of the year? #ICCAwards pic.twitter.com/g91bypUVsp
— Abdul Ghaffar 🇵🇰 (@GhaffarDawnNews) January 4, 2024
శుభ్మన్ గిల్ 2023లో శతకాలతో రికార్డులు బద్ధలు కొట్టాడు. మూడు ఫార్మాట్లలో సెంచరీ బాదడమే కాకుండా ఐపీఎల్ 16వ సీజన్లోనూ పరుగుల వరద పారించాడు. ఈ యువ కెరటం మొత్తంగా 48 మ్యాచుల్లో 46,82 సగటుతో 2,154 రన్స్ కొట్టాడు. ఇక కోహ్లీ విషయానికొస్తే.. 2022 ఆసియా కప్తో ఫామ్ అందుకున్న విరాట్ టీ20 వరల్డ్ కప్, అనంతరం స్వదేశంలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్లో చెలరేగాడు.
షమీ, డారిల్ మిచెల్
వన్డే వరల్డ్ కప్లో దక్షిణాఫ్రికాపై శతక గర్జన చేసిన కోహ్లీ 50 ఓవర్ల ఆటలో సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును బద్ధలు కొట్టాడు. భారత సీనియర్ పేసర్ షమీ వన్డే ప్రపంచకప్లో బుల్లెట్లాంటి బంతులతో వణికించాడు. భారత జట్టు ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించిన షమీ 24 వికెట్లతో అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు. మరోవైపు డారిల్ మిచెల్ 2023లో 1,204 పరుగులు సాధించాడు.