Matheesha Pathirana : ఐపీఎల్తో వెలుగులోకి వచ్చిన క్రికెటర్లలో మథీశ పథిరన(Matheesha Pathirana) ఒకడు. బౌలింగ్ సంచలనంగా పేరొందిన ఈ కుర్ర పేసర్ 17వ సీజన్లోనూ ఇరగదీస్తున్నాడు. డెత్ ఓవర్ స్పెషలిస్ట్గా చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ జూనియర్ మలింగ చెన్నై ఫ్రాంచైజీకి చెందిన ‘లయన్స్ అప్క్లోజ్'(Lions Upclose) షోలో మాట్లాడుతూ.. తన కెరీర్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
క్రికెట్లో తనకు మహేంద్ర సింగ్ ధోనీ(Mahendra Singh Dhoni) తండ్రితో సమానమని పథిరన అన్నాడు. ‘మా నాన్న తర్వాత నన్ను క్రికెట్లో ప్రోత్సహించే బాధ్యత తీసుకున్న వ్యక్తి ధోనీ. ఆయన నన్ను ఎంతో బాగా చూసుకుంటారు. నేను ఏం చేయాలో సలహాలు ఇస్తుంటారు. నేను ఇంటి వద్ద ఉన్నప్పుడు మా నాన్న కూడా ధోనీ లాగే పలు విషయాలు చెప్పేవాడు. మైదానంలో ఉన్నప్పుడు చిన్న సంగుతులే చెప్పినా.. అవి ఎంతో ప్రభావంతంగా పనిచేస్తాయి. దాంతో, నాలో ఆత్మవిశ్వాసం రెండింతలు అవుతుంది. అందుకనే క్రికెట్ గురూ ధోనీ నాకు తండ్రితో సమానం’ అని పథిరన వెల్లడించాడు.
“In my Cricket life, Dhoni is like my Father.”
🥹💛– Matheesha Pathirana 🎙️ pic.twitter.com/wvrLborwP2
— 🜲 (@balltamperrer) May 3, 2024
అంతేకాదు ధోనీ మరొక సీజన్ ఆడాలని పథిరన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు. మహీ భాయ్ మీరు మరొక సీజన్ ఆడితే మాతో కలిసి ఆడాలి. నేను ఒకవేళ ఇక్కడే ఉంటే ఎంతో సంతోషిస్తా అని ఈ యార్కర్ కింగ్ తెలిపాడు. 16వ సీజన్తో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన పథిరన తన మార్క్ చూపించాడు. 19 వికెట్లతో చెలరేగి చెన్నై జట్టు ఐదో టైటిల్ గెలవడంలో ఈ శ్రీలంక కుర్రాడు కీలక పాత్ర పోషించాడు. గత సీజన్ ఫామ్ను 17వ సీజన్లోనూ చూపిస్తున్న పథిరన రెచ్చిపోతున్నాడు. కేవలం ఆరు ఇన్నింగ్స్ల్లోనే 7.68 ఎకానమీతో 12 వికెట్లు తీశాడు.
చెన్నై జట్టు సభ్యుల పట్ల పెద్దన్నలా మెలిగే ధోనీ అంటే పథిరన కుటుంబ సభ్యులకు పిచ్చి అభిమానం. దాంతో కొన్ని రోజుల క్రితం పథిరన కుటుంబాన్ని ధోనీ కలిశాడు. వాళ్లతో కలిసి ఫొటోలు దిగాడు. ఆ ఫొటోలు ఆన్లైన్లో వైరల్ అయిన విషయం తెలిసిందే.