రవీంద్రభారతి : సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్(BRS) అభ్యర్థి తీగుళ్ల పద్మారావుగౌడ్ (Padmarao Goud) కే మాదిగల మద్దతు ఉంటుందని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS) సంఘం, మాదిగ స్టూడెంట్స్ పొలికల్ జేఏసీ చైర్మన్ రుషిపాక గణేష్ మాదిగ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కోఆర్టీనేటర్ మీసాల కురుమయ్యమాదిగ, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చేకూరి గణేష్మాదిగ, ప్రధాన కార్యదర్శి సందీప్ మాదిగ తెలిపారు.
శనివారం బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల ముద్దుబిడ్డ పద్మారావుగౌడ్కు సికింద్రాబాద్ పార్లమెంట్ ఎంపీగా భారీ మెజార్టీ (Huge Majority) తో గెలిపించుకుని పార్లమెంట్కు పంపిస్తామని ప్రకటించారు. తెలంగాణలో 80 లక్షల మంది ఉన్న మాదిగలుండగా కాంగ్రెస్ (Congress) పార్టీ ఒక్క సీటు ఇవ్వకుండా మోసం చేసిందని ఆరోపించారు.
రాజ్యాంగాన్ని మారుస్తామని అంటున్న బీజేపీ (BJP) కి ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. బీఆర్ఎస్ పేద ప్రజల కోసమే పుట్టిందని, రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్కు మాదిగలు అండగా ఉండి కాంగ్రెస్పార్టీని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముదిగొండ వెంకటేశ్వర్లు, అంజిమాదిగ, రమేష్మాదిగ తదితరులు పాల్గొన్నారు.