Team India : కొత్త ఏడాదిని విజయంతో ఆరంభించిన భారత జట్టు(Team India) సొంతగడ్డపై ఇంగ్లండ్ను ఢీ కొట్టేందుకు సిద్ధమైంది. ఐదు టెస్టుల సిరీస్లో బెన్ స్టోక్స్ సేనను చిత్తుగా ఓడించేందుకు వ్యూహాలకు పదును పెడుతోంది. జవవరి 25 గురువారం జరుగనున్న తొలి టెస్టు కోసం భారత జట్టు హైదరాబాద్ చేరుకుంది.
టీమ్ హోటల్ నుంచి మంగళవారం రోహిత్ సేన ఉప్పల్లోని రాజీవ్ గాంధీ స్టేడియానికి వెళ్లింది. అక్కడ కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ నెట్స్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. హైదరాబాదీ పేసర్ సిరాజ్, ఆఫ్ స్పిన్నర్ అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ బౌలింగ్ ప్రాక్టీస్ చేశారు. అనంతరం ఆటగాళ్లంతా మైదానంలోనే కాసేపు రిలాక్స్ అయ్యారు. టీమిండియా ప్రాక్టీస్ సెషన్ వీడియోను బీసీసీఐ ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది.
When it’s almost “time” for the first Test ⏳#TeamIndia | #INDvENG | @IDFCFirstBank pic.twitter.com/QbswZ1AMWZ
— BCCI (@BCCI) January 23, 2024
వన్డే వరల్డ్ కప్ అనంతరం దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన టీమిండియా కేప్టౌన్లో చిరస్మరణీయ విజయం సాధించింది. న్యూలాండ్స్లో జరిగిన రెండో టెస్టులో పేసర్లు జస్ప్రీత్ బుమ్రా 8, సిరాజ్ ఏడు వికెట్లుతో సఫారీలను వణికించారు. దాంతో, భారత జట్టు న్యూలాండ్స్లో గెలుపొందిన తొలి ఆసియా జట్టుగా చరిత్ర సృష్టించింది. ఆ విజయంతో జోష్ మీదున్న టీమిండియా స్వదేశంలో ఇంగ్లండ్ను మట్టికరిపించేందుకు రెడీ అవుతోంది. 2012 తర్వాత స్వదేశంలో ఒక్క టెస్ట్ సిరీస్ కూడా కోల్పోని భారత్ ఆ రికార్డును
కొనసాగించాలని ఫ్యాన్స్ సైతం కోరుకుంటున్నారు.
విరాట్ కోహ్లీ
బ్యాటింగ్ యూనిట్లో కీలకమైన కెప్టెన్ రోహిత్.. అఫ్గనిస్థాన్తో జరిగిన ఆఖరి టీ20లో సెంచరీతో ఫామ్ చాటుకున్నాడు. ఓపెనర్గా యశస్వీ జైస్వాల్ దంచి కొట్టేందుకు తహతహలాడుతుండగా.. మూడో స్థానంలో విరాట్ కోహ్లీ బదులు ఆడేది ఎవరు? అనేది రేపటితో తేలిపోనుంది. ఇక మిడిల్ ఆర్డర్లో శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్.. లోయర్ ఆర్డర్లో అక్షర్ పటేల్, జడేజా, అశ్విన్లు విలువైన పరుగులు జోడించగల సమర్థులే.