హైదరాబాద్: రణ్బీర్ కపూర్ నటించిన యానిమల్ చిత్రం ఓటీటీ(Animal OTT )లో రిలీజ్ కానున్నది. సందీప్ రెడ్డి వంగ ఆ ఫిల్మ్ను డైరెక్ట్ చేశారు. బాక్సాఫీసు వద్ద ఆ ఫిల్మ్ ఇప్పటికే వంద కోట్లకు పైగా కలెక్షన్లు రాబ్టటింది. ఇక ఓటీటీ ఫ్లాట్ఫామ్లో ఆ చిత్రానికి చెందిన రన్టైంను పెంచనున్నారు. అదనంగా మరో 8 నిమిషాలు జోడిస్తున్నట్లు నిర్మాతలు వెల్లడిస్తున్నారు.
డిసెంబర్ ఒకటో తేదీన ఆ ఫిల్మ్ థియేటర్లలో రిలీజైన విషయం తెలిసిందే. ఆ సినిమా రన్టైం మూడు గంటల 21 నిమిషాలు. అయితే నెట్ఫ్లిక్స్లో ఆ సినిమాను 3 గంటల 29 నిమిషాల పాటు స్ట్రీమ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఓటీటీ ప్రేక్షకుల కోసం రష్మికతో ఉన్న ఓ కీలకమైన సన్నివేశాన్ని చూపించనున్నట్లు కొన్ని వర్గాల ద్వారా తెలుస్తోంది.
జనవరి 26వ తేదీ నుంచి నెట్ఫ్లిక్స్లో యానిమల్ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయనున్నారు. థియేటర్లలో ఇప్పటికే ఈ ఫిల్మ్కు ఫుల్ క్రేజ్ వచ్చింది. కానీ కొన్ని సీన్లలో హింసను అతిగా చూపించినట్లు విమర్శలు వచ్చాయి.