BCCI : టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత జట్టు స్వదేశంలో తొలి సిరీస్కు సిద్ధమైంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా త్వరలోనే బంగ్లాదేశ్(Bangladesh)తో రెండు టెస్టు మ్యాచ్లు ఆడనుంది. ఇప్పటికే ఈ సిరీస్ షెడ్యూల్ ప్రకటించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI).. తొలి టెస్టు కోసం ఆదివారం 16 మందితో కూడిన స్క్వాడ్ను వెల్లడించింది.
కారు యాక్సిడెంట్ తర్వాత టీ20 వరల్డ్ కప్లో భారత జట్టుకు ఆడిన రిషభ్ పంత్(Rishabh Pant) తుది బృందంలో చోటు దక్కించుకున్నాడు. దులీప్ ట్రోఫీలో బంతితో అదరగొట్టిన యశ్ దయాల్, ఆకాశ్ దీప్లపై కూడా స్క్వాడ్లో ఉన్నారు. సెప్టెంబర్ 19న భారత్, బంగ్లాదేశ్ల మధ్య తొలి టెస్టు జరుగనుంది. అనంతరం సెప్టెంబర్ 27 కాన్పూర్లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో రెండో టెస్టు నిర్వహించనున్నారు.
🚨 NEWS 🚨- Team India’s squad for the 1st Test of the IDFC FIRST Bank Test series against Bangladesh announced.
Rohit Sharma (C), Yashasvi Jaiswal, Shubman Gill, Virat Kohli, KL Rahul, Sarfaraz Khan, Rishabh Pant (WK), Dhruv Jurel (WK), R Ashwin, R Jadeja, Axar Patel, Kuldeep… pic.twitter.com/pQn7Ll7k3X
— BCCI (@BCCI) September 8, 2024
భారత స్క్వాడ్ : రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వీ జైస్వాల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్(వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, సిరాజ్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, యశ్ దయాల్.