Shriya Saran | టాలీవుడ్, కోలీవుడ్ తార నటి శ్రియ శరణ్ (Shriya Saran) సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth)తో నటించిన ‘శివాజీ: ది బాస్’ (Sivaji: The Boss) సినిమా బ్లాక్బస్టర్గా నిలిచిన సంగతి తెలిసిందే. శ్రియ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక మధురమైన జ్ఞాపకాన్నిశ్రియ తాజాగా పంచుకున్నారు.
దర్శకుడు శంకర్ తనకు ఆ అవకాశం ఇచ్చిన వైనం గురించి ఆమె మాట్లాడుతూ..ఒకరోజు శంకర్ సర్ నాకు ఫోన్ చేసి, ‘ఒక సినిమా ఉంది, అందులో పనిచేస్తావా?’ అని అడిగారు. నేను సరేనని చెప్పాను, ఆయన ‘సరే’ అన్నారు. నేను అక్కడికి వెళ్లేసరికి చాలా మంది ప్రముఖులు వచ్చారు. ఎ.ఆర్. రెహమాన్ సర్, రజనీకాంత్ సర్ వచ్చారు. అప్పుడు నేను శంకర్ గారిని చూసి, ‘ఇది కచ్చితంగా చాలా పెద్ద సినిమా అయి ఉంటుంది’ అనుకున్నాను, ఎందుకంటే అక్కడ అంత పెద్ద వాళ్ళంతా గుమిగూడారు. అప్పుడు ఆయన నన్ను చూసి, ‘మీ కో-స్టార్ రజనీకాంత్ సర్ని కలవండి’ అని చెప్పారు. దానికి నేను షాక్ అయ్యి ‘అవునా… సరే!’ అన్నాను. ఆ తర్వాత అక్కడ ఎ.ఆర్. రెహమాన్ సర్ ఉన్నారు, అలాగే సినిమాటోగ్రాఫర్ కే.వి. ఆనంద్ సర్ కూడా ఉన్నారు” అంటూ రజనీకాంత్తో తన మొదటి పరిచయ క్షణాలను శ్రియ ఎంతో సరదాగా గుర్తుచేసుకున్నారు.
#Shriya about First Meeting With #Rajinikanth:
So, #Shankar sir called me and said, “There’s a movie. Will you work in it?” I said yes, and he said, “Okay.”
When I reached there, many big personalities were coming — #ARRahman sir, #Rajinikanth sir. So, I looked at #Shankar and… pic.twitter.com/Tb2g2NC1UQ
— Filmyscoops (@Filmyscoopss) August 13, 2026